AP News: రైతుల కోసం కదం తొక్కిన టీడీపీ నేతలు.. పట్టిసీమకు తాళం వేశారని ఫైర్‌.. వివరాలివే!

గుంటూరులో డెల్టా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. కృష్ణ డెల్టా రైతాంగం నారుమళ్లు అయిపోయి నీరు కోసం ఎదురుచూడటం దారుణమన్నారు.

New Update
AP News: రైతుల కోసం కదం తొక్కిన టీడీపీ నేతలు.. పట్టిసీమకు తాళం వేశారని ఫైర్‌.. వివరాలివే!

గుంటూరులో డెల్టా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. కృష్ణ డెల్టా రైతాంగం నారుమళ్లు అయిపోయి నీరు కోసం ఎదురుచూడటం దారుణమన్నారు. ఏ నీరు ఎప్పుడు వాడాలో కూడా కనీస పరిజ్ఞానం లేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఫైర్‌ అయ్యారు. ఏదన్నా సమస్యపై మంత్రులు మాట్లాడమంటే బూతులు తప్ప ఏమి మాట్లాడారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 5 లక్షల70వేల ఎకరాలు సాగులోకి ఉన్నాయన్నారు. ఇరిగేషన్ కోసం ఏమి చేశారు..? అంటే మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు ఇళ్ల వెంట తిరగటం కాదు రైతు దగ్గరకు పొలాల వెంట తిరగాలని నక్కా ఆనందబాబు డిమాండ్‌ చేశారు.

నీళ్లు ఇష్టానుసారంగా వాడేసి

వైసీపీ ప్రభుత్వం వచ్చాక నలుగు ఏళ్లు పట్టిసీమకు తాళం వేశారని ఫైర్‌ అయ్యారు. నీళ్లు ఇష్టానుసారంగా వాడేసి ఇప్పుడు నీళ్లు కోసం ఏమి చెయ్యాలి తెలియని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.నీటి విషయంలో జగన్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉందని జోస్యం చెప్పారు. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులు కోల్పోయే పరిస్థితి జగన్ తెచ్చారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం చర్యల వల్ల రాబోయే రోజుల్లో డెల్టా ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. రైతాంగన్నీ నాశనం చేసే విధంగా జగన్ పాలన ఉన్నదన్నారు. రెండు రోజులు సమయం ఇస్తున్నాము డెల్టా రైతాంగానికి నీరు ఇవ్వాలి లేని పరిస్థితుల్లో అధికారులు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాము సవాల్‌ చేశారు.

వైసీపీ నాయకులు వాటాలు పంచుకుంటున్నారు

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వ్యవసాయం అంటే పూర్తిగా అవగాహన లేని పాలన జగన్ పాలనలో చూస్తున్నామన్నారు. ఒక్క ఎకరానికి కూడా సరిగ్గా నీరు పెట్టుకొలేన పరిస్థితిల్లో రైతాంగం ఉందన్నారు. ప్రభుత్వం వ్యవసాయం పట్ల గానీ, రైతుల పట్ల గానీ ఒక్క చర్చ అన్న పెట్టరా..? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతాంగం పూర్తిగా నాశనం అవుతున్న పరిస్థితి ఉందన్నారు. రైతుల విషయంలో ఏదో ఒక రకంగా కాలయాపన వైసీపీ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. కాల్వలు బాగుచెయ్యకుండ బాగు చేసుకున్నట్టు వైసీపీ నాయకులు వాటాలు పంచుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. కృష్ణా నీరు హక్కులను పూర్తిగా కాలరాస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరినీ కలిసి వచ్చి కృష్ణా జలాల విషయం అక్కడ చెప్పకుండా ఇక్కడికి వచ్చి లెటర్ రాస్తున్నాను అని చెబుతున్నారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రానుంది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్ర మంత్రి బీఎల్ శర్మ

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్క్ శంకర్‌ను కాపాడిన సింగపూర్ స్కూల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. పవన్‌‌తో మోదీ మాట్లాడి.. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

author-image
By K Mohan
New Update
PM modi pK

PM modi pK Photograph: (PM modi pK)

సింగపూర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారిక సమాచారాన్ని వెల్లడించారు. ప్రధాన మంత్రి మోదీ కూడా పవన్ కళ్యాన్‌కు ఫోన్ చేసి మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రమాదం గురించి, బాబు ఆరోగ్య పరిస్దితి గురించి మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రమాదంలో పవన్‌ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి 7గంటలకు ఫ్లైట్‌లో సింగపూర్ బయలుదేరనున్నారు.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

స్కూల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌ను కాపాడిన సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడికి చికిత్స కొనసాగుతోందని జనసేన లీడర్ తెలిపారు. జరిగిన ప్రమాదంపై పవన్‌ కళ్యాణ్‌తో మోదీ మాట్లాడారని ఆయన చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాని మోదీ చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Also read: Dubai Crown Prince: ఢిల్లీకి చేరుకున్న అత్యంత సంపన్నుడు దుభాయ్ రారాజు.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment