YS Sharmila: వైఎస్సార్ విగ్రహాలపై దాడులు పిరికిపందల చర్య: షర్మిల ఫైర్

AP: వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు షర్మిల. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని పేర్కొన్నారు. ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

New Update
YS Sharmila: వైఎస్సార్ విగ్రహాలపై దాడులు పిరికిపందల చర్య: షర్మిల ఫైర్

YS Sharmila On YSR Statue Attacks: ఏపీలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు షర్మిల. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం అని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే అని పిలుపునిచ్చారు. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని వ్యాఖ్యానించారు.

తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం అని.. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు అని తెలిపారు. వైఎస్సార్ ను అవమాయించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని అన్నారు.

Also Read: కొడుకు దగ్గరికి విజయమ్మ.. ఆసక్తికరంగా వైఎస్ ఫ్యామిలీ రాజకీయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు