YS Sharmila: మోడీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. షర్మిల ఫైర్

AP: కాంగ్రెస్‌పై మోడీ విషం చిమ్ముతున్నారని అన్నారు షర్మిల. మతాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారని.. మోడీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

New Update
YS Sharmila : YSR పేరును చార్జిషీట్ లో పెట్టించింది జగన్ .. షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila: బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభలో బీజేపీ పై విమర్శలు గుప్పించారు పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల. కాంగ్రెస్‌పై మోడీ విషం చిమ్ముతున్నారని అన్నారు. మతాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ద్వేషం పెంచుతారా ? అని నిలదీశారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు సృష్టించారు? అని అన్నారు. రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారని.. మోడీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు