Vasamsetti Subhash: గంజాయి గ్యాంగ్ను పట్టిస్తే రూ.5వేల నజరానా.. మంత్రి బంపర్ ఆఫర్! గంజాయి అమ్మే, తాగే గ్యాంగ్ లను పట్టిస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా రూ.5వేలు ఇస్తానని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. అలాగే తనకు గంజాయి బ్యాచ్తో సంబంధాలున్నాయనే ఆరోపణలను నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. By srinivas 09 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP News: గంజాయి అమ్మేవాళ్లను, తాగే వాళ్ళను పట్టిస్తే రూ.5వేల రూపాయలు ఇస్తానంటూ ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subhash) బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు గంజాయి బ్యాచ్ తో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే మంత్రి పదవితోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఈ మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అంబాజీపేటలో మహేష్ బాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వాసంశెట్టి సుభాష్.. గంజాయి సప్లై చేసే వారిని గాని, అమ్మే వాళ్ళ వివరాలు తెలిపితే ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తాను రూ. 5వేల రూపాయలు ఇస్తానన్నారు. గంజాయితో దొరికిన వ్యక్తికి నాకు సంబంధం ఉందని ఓ మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. గంజాయి సప్లై చేసే వాళ్ళు హైదరాబాదులో దొరికితే అతను నా అనుచరుడు అంటూ ఆరోపిస్తున్నారు. నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామాచేస్తానంటూ సుభాష్ సంచలన కామెంట్స్ చేశారు. Also Read: బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయం #vasamshetty-subhash #ap-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి