Breaking : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వాయ్ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొని ఒకరి మృతి!

ఏపీ మినిస్టర్ ఆదిమూలపు సురేశ్‌ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ముందు వాహనంలో ఉండడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

New Update
Breaking : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వాయ్ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొని ఒకరి మృతి!

Ap Minister : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్(Audimulapu Suresh)  కాన్వాయ్‌ లోని ఎస్కార్ట్‌ వాహనం(Escort Vehicle) ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా(Prakasam District) త్రిపురాంతకం మండలంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకాశం జిల్లా నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని కేశినేని పల్లి వద్ద జాతీయ రహదారి పై మంత్రి ఎస్కార్ట్‌ వాహనం ఓ ఆటోను వేగంగా , బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా మృతి చెందిన వ్యక్తిని మనరాజుపాళెంకు చెందిన ఇజ్రాయేల్‌ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి సురేశ్(Minister Suresh) ముందు వాహనంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వివరించారు.

Also Read : నిరుద్యోగులకు టీటీడీ గుడ్‌ న్యూస్..భారీగా ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసేయండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు