AP JOBS : ఏపీ వైద్యారోగ్య శాఖలో 76 ఉద్యోగాలు.. టెన్త్ ఉంటే చాలు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 76 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకూ అప్లై చేసుకోవాలి.

New Update
AP JOBS : ఏపీ వైద్యారోగ్య శాఖలో 76 ఉద్యోగాలు.. టెన్త్ ఉంటే చాలు

Medical Jobs : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. ఇటీవలే నెల్లూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయంలోని 26 పోస్టుల భర్తీకి ధరఖాస్తు కోరిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో ఉద్యోగ ప్రకటన చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది. ఈ మేరకు కాకినాడ(Kakinada)లోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలోలో కాంట్రాక్ట్ విధానంలో పలు మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర 76 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ పోస్టుల అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తిర్ణులై ఉండాలి.

1. మెడికల్ ఆఫీసర్ : 18
2. స్టాఫ్ నర్స్ : 43
3. ల్యాబ్ టెక్నీషియన్ : 06
4. సీనియర్ ట్యూబర్క్యులోసిస్ ల్యాబోరేటరీ : 01
5. క్వాలిటీ మేనేజర్ : 01
6. ఆడియో మెట్రికేషన్ : 03
7. ఫార్మసిస్ట్ : 02
8. ఎల్ జీఎస్ : 02

ఇది కూడా చదవండి : డీప్ ఫేక్ వీడియోపై అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అద్భుతాలు చేస్తున్నారంటూ

ఇక ఈ మొత్తం పోస్టుల సంఖ్య 76 ఉండగా పోస్టును అనసరించి టెన్త్, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తిర్ణులై ఉండాలి. అర్హతలున్న అభ్యర్థులు ఆన్ లైన్ వేదికగా 2023 డిసెంబర్ 15 వరకూ దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment