AP Game Changer : విశాఖ ఎంపీగా బాలకృష్ణ అల్లుడు భరత్ గెలుపు? ఆర్టీవీ సర్వే లెక్కలివే!

విశాఖ ఎంపీ సీటులో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సినీ హీరో బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్‌, మంత్రి బొత్స భార్య ఝాన్సీ మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. అయితే.. వీరిలో ఎవరు గెలుస్తారు? ఆర్టీవీ సర్వేలో ఏం తేలింది? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

New Update
AP Game Changer : విశాఖ ఎంపీగా బాలకృష్ణ అల్లుడు భరత్ గెలుపు? ఆర్టీవీ సర్వే లెక్కలివే!

Vizag : ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన లోక్‌సభ(Lok Sabha) సీటు విశాఖ. ఇక్కడ కూటమి అభ్యర్థి, బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్‌కు మంత్రి బొత్స భార్య ఝాన్సీ గట్టి పోటీ ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల కన్నా తన సతీమణి పోటీ చేస్తున్న విశాఖపైనే బొత్స ఎక్కువగా ఫోకస్‌ పెట్టడం ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే రెండు చోట్లా పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏ మాత్రం పట్టులేని నియోజకవర్గం కావడం వైసీపీకి ప్రతికూల అంశం. publive-image

Also Read : ఏపీలో కాబోయే ఎంపీలు వీరే.. ఆర్టీవీ స్టడీ ఫలితాలు!

publive-image

టీడీపీ(TDP) అభ్యర్థి శ్రీభరత్‌ ప్రచారంలో దూకుడుగా ఉన్నారు. ఎలక్షనీరింగ్‌లోనూ పైచేయి సాధిస్తున్నారు. రెండు మూడు నెలల నుంచి రోజూ జనంలోనే ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. యంగ్‌ లీడర్‌ కావడం, గతంలో ఓడిపోయారన్న సానుభూతి, కూటమి ప్రభావం భరత్‌కు సానుకూలం. విశాఖ సిటీ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ(YCP) కి పడే ఓట్లలో క్రాస్‌ ఓటింగ్‌ భరత్‌కు అనుకూలిస్తుందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఓవరాల్‌గా విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌ గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన.

New Update
Nidadavole Police Station

Nidadavole Police Station

AP Crime News : ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలులోని ఎంవీనగర్ దానమ్మ గుడివద్ద గల లలితదేవి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.12,50,000 విలువ చేసే బంగారంతో పాటు రూ.10000 నగదు చోరికి గురైంది. లలితదేవి బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో పాటు నగలు చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి క్లూస్ సేకరించారు.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

కాగా పోలీసులు అన్ని రకాలుగా విచారించి చోరి చేసింది లలితాదేవి చెల్లెలే అని నిర్ధారించారు. ఇటీవల నిడదవోలులోని అక్క ఇంటికి వచ్చిన చెల్లెలు లక్ష్మీ శైలజ. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శైలజ అక్క ఇంట్లో డబ్బు, బంగారం చూడగానే దుర్భిద్ది పుట్టింది. దీంతో మరో రోజు పగడ్భందిగా ప్లాన్ చేసింది. చేసి అక్క బావ ఇంట్లో లేనప్పుడు చూసి మరో ఇద్దరు సాయంతో అక్క ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడింది. అక్క ఇంటికి రాగానే ఇల్లంతా చిందర వందరంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా చెల్లెలును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment