AP Game Changer : అనకాపల్లిలో సీఎం రమేష్ గెలుస్తారా?.. ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందంటే?

అనకాపల్లి లోక్‌సభ సెగ్మెంట్ లో వైసీపీ నుంచి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

New Update
AP Game Changer : అనకాపల్లిలో సీఎం రమేష్ గెలుస్తారా?.. ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందంటే?

Anakapalle : అనకాపల్లి లోక్‌సభ(Lok Sabha) సీటులో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, బీజేపీ(BJP) అభ్యర్థి సీఎం రమేష్‌(CM Ramesh) ను ఢీకొడుతున్నారు. అభ్యర్థిలిద్దరూ నాన్‌ లోకల్‌. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రచారంలో ఘర్షణలు అనకాపల్లిలో ఎన్నికల వేడిని మరింత పెంచేశాయి. ముత్యాలనాయుడు ఆఖరి నిమిషంలో అభ్యర్థిగా ఖరారుకావడం ఇబ్బందిగా మారింది. మంత్రిగా ఉన్నా అభివృద్ధి చేయలేదనే అసంతృప్తి జనంలో ఉంది.

publive-image publive-image

పైగా కుటుంబంలో అసమ్మతి పెద్ద తలనొప్పిగా మారింది.  మొదటి భార్య కొడుకు బూడి రవి తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పైగా ముత్యాలనాయుడు కూతురు పోటీ చేస్తున్న మాడుగుల అసెంబ్లీ సీటు(Assembly Seat) లో రవి ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు.

publive-image

ఇక సీఎం రమేష్‌కి అన్ని చోట్లా కూటమి నేతల మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇంటింటికీ తన పేరు, పార్టీ గుర్తు వెళ్లేలా చేయడంలో సక్సెస్‌ అయ్యారు. ఎంపీ సీటులో రమేష్‌కు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్‌గా అనకాపల్లిలో సీఎం రమేష్‌కు విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

publive-image

Also Read : విశాఖ ఎంపీగా బాలకృష్ణ అల్లుడు భరత్ గెలుపు? ఆర్టీవీ సర్వే లెక్కలివే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment