AP Opinion Poll 2023: ఏపీలో జగన్ కు షాకిచ్చిన సర్వే... ఎన్ని సీట్లు తగ్గుతాయంటే?

దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఏపీలో అధికార, విపక్షాల మధ్య వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ, సీఎన్ఎస్స్ సంస్థలు లోకసభ స్థానాలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో సంచలన ఫలితాలు బయటకు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఈసారి అధికార వైసీపీ సీట్ల శాతం తగ్గింది. అటు టీడీపీ కాస్త ఊరటనిచ్చేలా ఈ ఫలితాలు ఉన్నాయి. వైసీపీకి 46శాతం ఓట్లు రాగా..టీడీపీ 42శాతం ఓట్లు పోల్ అవుతాయంటూ సర్వే తెలిపింది.

New Update
CM Jagan: చంద్రబాబు అరెస్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

AP Elections 2024 Survey- India TV : దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఏపీలో అధికార, విపక్షాల మధ్య వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ, సీఎన్ఎస్స్ సంస్థలు లోకసభ స్థానాలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో సంచలన ఫలితాలు బయటకు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఈసారి అధికార వైసీపీ (YSRCP) సీట్ల శాతం తగ్గింది. అటు టీడీపీ (TDP) కాస్త ఊరటనిచ్చేలా ఈ ఫలితాలు ఉన్నాయి. వైసీపీకి 46శాతం ఓట్లు రాగా..టీడీపీ 42శాతం ఓట్లు పోల్ అవుతాయంటూ సర్వే తెలిపింది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ (BJP), ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ (Congress) కు కేవలం రెండు శాతం మాత్రమే ఓట్లు పడతాయని పేర్కొంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో సంచలన సర్వే.. బీఆర్ఎస్ కు తగ్గనున్న సీట్లు.. లెక్కలివే!

ఇక ఏపీలో రానున్న లోకసభ ఎన్నికల్లో మొత్తం 25లోకసభ స్థానాలకు గానూ..వైసీపీ 15స్థానాల్లో గెలుస్తుందని..టీడీపీ 10 సీట్లలో గెలుపొందుతుందని సర్వే తేల్చింది. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార వైసీపీకి 22 స్థానాలు రాగా..టీడీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ప్రస్తుత సర్వే ప్రకారం వైసీపీ 7 ఎంపీ సీట్లు కోల్పోనుండగా..టీడీపీ 7 స్థానాలను తన ఖాతాలో వేసుకోనుందని సర్వే చెప్పింది. అంటే ఈ సర్వేను బట్టి చూస్తే జగన్ కు ప్రజల్లో కాస్త ఆదరణ కొంతమేర తగ్గిందని సర్వే చెబుతోంది.

publive-image

మొత్తంగా ఈ సర్వే ఫలితాలను చూస్తుంటే టీడీపీ వైపు ప్రజలు చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రలో జైల్లో ఆపార్టీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) ప్రజల నుంచి కాస్త సింపతి వచ్చినట్లే కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి:రాత్రి పదిలోపే నిద్రపోతే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

సీఎం జగన్ (CM Jagan) ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. దీంతో ఈ సర్వే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయా? లేదా అప్పటి వరకు రాజకీయ పరిస్థితులు మారి సర్వే రివర్స్ అవుతుందా? అన్నది తేలాలంటే ఎలక్షన్స్ పూర్తయి.. ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CM Chandrababu: ఇవాళే అకౌంట్లోకి రూ.20 వేలు.. AP సర్కార్ కొత్త పథకం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమచేయనున్నారు.

New Update
Matsyakara sevalo scheme

Matsyakara sevalo scheme

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం గ్రామంలో ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా ఈ ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఒక్కో కుటుంబానికి రూ.20,000

ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ప్రారంభించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు రూ.20,000 చెక్కును అందజేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అంటే దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేం. కాబట్టి ఆ సమయంలో మత్స్యకారులు వారి జీవనోపాధి కోల్పోతారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

దానిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం.. వేటలేని కాలంలో మత్స్యకారులకు జీవనోపాధిని కొనసాగించడానికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంది. కాగా గత ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10,000 సహాయాన్ని అందించింది. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారికి రూ. 20,000 సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.258 కోట్లు కేటాయించింది.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

cm-chandra-babu | ap cm chandra babu naidu | Matsyakara sevalo | srikakulam

Advertisment
Advertisment
Advertisment