Pawankalyan: పిఠాపురంలో పవన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే! ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మూడురోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా వారాహి సభ నిర్వహించనున్నారు. మంగళ, బుధ వారాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. By srinivas 30 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pithapuram: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం నుంచి బుధవారం వరకూ మూడురోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా వారాహి సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. పవన్కు ఘన స్వాగతం పలికేందుకు జనసైనికులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశా. 3 రోజుల పర్యటన వివరాలు: జూలై 1: * ఉదయం 10 గంటలకు గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం. * మధ్యాహ్నం చేబ్రోలు నివాసంలో పిఠాపురం జనసేన నాయకులతో సమావేశం. జూలై 2: * కాకినాడ కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పంచాయతీ, అటవీ కీలక శాఖలపై సమీక్షా సమావేశం * మధ్యాహ్నం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జూలై 3: * ఉప్పాడ, యు.కొత్తపల్లిలో క్షేత్ర పర్యటన. * మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ కీలక నేతలతో భేటీ. * సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో బహిరంగ సభ & హెలికాప్టర్లో విజయవాడకు రిటర్న్..! #pawan-kalyan #pithapuram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి