Vijayamma: జగన్‌, షర్మిల మధ్య పొలిటికల్‌ వార్‌.. విదేశాలకు విజయమ్మ.. కారణం ఇదే..!

జగన్, షర్మిల పాలిటిక్స్ మధ్య తల్లి విజయమ్మ నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలో తెలియక ఆమె అమెరికా వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయమ్మ అమెరికాకు వెళ్లడంపై ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

New Update
Vijayamma: జగన్‌, షర్మిల మధ్య పొలిటికల్‌ వార్‌.. విదేశాలకు విజయమ్మ.. కారణం ఇదే..!

YS Vijayamma: ఏపీ పాలిటిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల్లో అన్నకు ప్రత్యర్థిగా మారిపోయిన వైఎస్ షర్మిల సీఎం జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. షర్మిల తీరుపై అటు జగన్‌ సైతం సీరియస్‌ అవుతున్నారు. ఓ రేంజ్‌లో ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నారు. ఇలా ఏపీలో అన్నాచెల్లెళ్లు జగన్‌, షర్మిల మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది.

Also Read: వైసీపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే..!

ఇదిలా ఉంటే, ప్రస్తుతం కొడుకు కూతురు మధ్య తల్లి విజయమ్మ నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరిలో ఎవరికి మద్దతివ్వాలో తెలియక సతమతవుతున్నారు. బస్సు యాత్రలకు ఇద్దరినీ ఆశీర్వదించి పంపిన ఆమె ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎవరి వైపు నిలబడాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నట్లు అర్థమవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో కూతురు షర్మిలకు అండగా నిలిచిన విజయమ్మ ఏపీలో ఎవరికి మద్దతుగా నిలబడుతారోనని ఉత్కంఠ నెలకొంది. కొందరూ తల్లి విజయమ్మ సపోర్ట్ జగన్ కు అంటుండగా మరికొందరూ షర్మిలకే అని కామెంట్స్ చేసేవారు.

Also Read: పాకిస్థాన్‌లో దారుణం.. భార్య, ఏడుగురు పిల్లలకు తిండి పెట్టలేక..!

అయితే, అందరి అంచాలకు దూరంగా విజయమ్మ ఎన్నికల వేళ విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న మనవడు, షర్మిల కొడుకు దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు విజయమ్మ అమెరికాలోనే ఉంటారని సమాచారం. అయితే, విజయమ్మ అమెరికాకు వెళ్లడంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కొడుకు కూతురు మధ్య ఎన్నికల ఒత్తిడి తట్టుకోలేకనే విజయమ్మ అమెరికా వెళ్లిపోయారా? అని రాజకీయా నాయకులు అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Paster praveen: ప్రవీణ్ ది హత్య కాదు యాక్సిడెంట్.. మద్యం మత్తులోనే: సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు!

పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేసినట్లు తెలిపారు.

New Update
prvn pstr

paster praveen case

Paster praveen: పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ లోని నేతాజి నగర్ ఇంటినుంచి బయలుదేరిన ఆయన.. రాజమండ్రి చేరుకునే లోపు మూడుసార్లు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీపుటేజీ ఆధారాలు వెల్లడించారు. అంతేకాదు మూడుసార్లు యాక్సిడెంట్ జరిగిందని, తనకై తానే బైక్ అదుపుతప్పి పడిపోయినట్లు వీడియోలు బయటపెట్టారు. 

ఒక పెట్రోల్ బంకులోనూ మద్యంమత్తులో ఉన్న ప్రవీణ్ బైక్ నడపలేక తడబడుతున్నట్లు కనిపించింది. బంకులో పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలోనూ బైక్ హ్యాండిల్ కు బదులు పెట్రోల్ పైపును పట్టుకున్నారు. తన వెనకాల ఉన్న లగేజ్ జారిపడిపోతున్న పెద్దగా పట్టించుకోలేదు. మరోచోట టీ తాగినపుడు ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు గుర్తించి బైక్ పై వెళ్లొద్దని, కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన వినకుండా అలాగే బైక్ పై వెళ్లారు. చివరగా అర్థరాత్రి 11 తర్వాత అతి వేగంగా వెళ్తూ రోడ్డుపక్కన పడిపోయారు. దీంతో తీవ్రగాయాలు కావడంతోపాటు అతను మద్యం సేవించి ఉండటం వల్ల త్వరగా చనిపోయినట్లు ఐజీ ఆశోక్ కుమార్ స్పష్టం చేశారు. 

Also Read: USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు

ఇంటినుంచి బయలుదేరిన ప్రవీణ్ డైరెక్టుగా ఎవరినీ కలవలేదని తెలిపారు. రెండు వారాలు సమయం ఇచ్చినా ఎవరు ఆధారాలతో రాలేదన్నారు. మొత్తం 92 మందిని ఇన్విస్టిగేషన్ చేశామన్నారు. ఇక ఈ ఇష్యూ ఇంతటితో ముగిసిందని, ఎవరు అనవసర వివాదాలు చేయొద్దని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవీన్ కుటుంబానికి ప్రైవసీ అవసరమని, దయచేసి ఎవరు దీనిని పక్కదారి పట్టించొద్దని కోరారు. 

 paster praveen | case | police | telugu-news 

Advertisment
Advertisment
Advertisment