AP Breaking: మరో కీలక పోలీస్ అధికారిపై ఈసీ వేటు

నిన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఈసీ.. తాజాగా మరో కీలక అధికారిపై చర్యలు తీసుకుంది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.

New Update
AP Breaking: మరో కీలక పోలీస్ అధికారిపై ఈసీ వేటు

EC Transfers Anantapur DIG Ammireddy: ఏపీలో మరో అధికారిపై ఈసీ వేటు వేసింది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అధికార పార్టీకి సహకరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుతోనే అధికారులపై వరుసగా బదిలీ వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. నిన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy) పై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికలకు సంబంధించిన విధులను ఆయనకు అప్పగించవద్దని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది ఈసీ.
ఇది కూడా చదవండి: AP Elections 2024 : కళ్యాణదుర్గంలో టెన్షన్‌ టెన్షన్.. అమ్మకానికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు?

ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు రాష్ట్ర పోలీస్ బాస్ పై వేటు వేయడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ రోజు సాయంత్రంలోగా ఏపీకి కొత్త డీజీపీని ఈసీ నియమించే అవకాశం ఉంది. విజయవాడ పోలీస్ కమిషనర్, ఇంటెలీజెన్స్ డీజీపై కూడా ఈసీ గతంలో వేటు వేసిన విషయం తెలిసిందే. విజయవాడలో సీఎం జగన్ పై దాడి ఘటన నేపథ్యంలో వీరిద్దరిపై బదిలీ వేటు వేసింది ఈసీ.

మరో వైపు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కూడా ఈసీ యాక్షన్ తీసుకుంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. CS జవహర్‌రెడ్డి తీరుపైనా ఇప్పటికే ఈసీకి అనేక ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా న్షన్ల పంపిణీ వ్యవహారంలో CS తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహంగా ఉన్నాయి. ఈసీ ఆదేశాలను ఆయన అమలు చేయడం లేదంటూ ఇప్పటికే ఫిర్యాదు చేశాయి ప్రతిపక్షాలు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్‌ (6), విజయ్‌ (6), యశ్వంత్‌ (7) లు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

New Update
annamaiah crime news

annamaiah crime news

AP Crime: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. సరదాకు ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు పాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అప్పటి వరకు ఆ ఊరంతా రామ నామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా.. గ్రామస్థులంతా ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్లారు. పండుగ వేళ ఉరంతా సంతోషంగా ఉన్న సమయంలో ఓ విషాదం జరిగింది.  వేడుక అనంతరం ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. విషయం తెలుసుకున్న  కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కన్న బిడ్డులు మృతి చెందిన విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు. 

ప్రాణం తీసిన ఈత..

ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం జరిగింది. చిట్వేలి మండలంలో ఎం. రాచపల్లికి చెందిన చొక్కరాజు నరసింహరాజుకు కుమారుడు దేవాన్ష్‌ (6), శేఖర్‌రాజు కుమారుడు విజయ్‌ (6), వెంకటేష్‌ కుమారుడు యశ్వంత్‌ (7)లు కలిసి గ్రామంలో జరిగిన సీతారాముల ఉభయంలో పాల్గొన్నారు. అనంతరం ఊరి సమీపంలోని నీటి కుంట దగ్గరకు ఈత కొట్టేందుకు వెళ్లారు. నీళ్లలో దిగి ఈత రాక.. ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. పిల్లల ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆలయం దగ్గర ఉన్నారు అనుకోని ఇంటికి వెళ్లారు. 

ఇది కూడా చదవండి: యువతకు నోటి క్యాన్సర్ ముప్పు..ఈ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు

సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆలయ మైకులో పేర్లు చెప్పించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఊరు బయట ఉన్న నీటి కుంట దగ్గర వెతకగా.. ముగ్గురి మృతదేహం లభ్యమైంది. విజయ్, యశ్వంత్‌ల తల్లితండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లారు. చిట్వేలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో వీరిని చదివిస్తున్నారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. పిల్లల మరణానికి కారణమైందని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేసవి విడిది కోసం బెస్ట్‌ ప్లేసులు ఇవే

( ap-crime-news | ap crime latest updates | latest-news )

Advertisment
Advertisment
Advertisment