విపక్ష కూటమి కన్వీనర్ రేసులో మరో నేత... తెరపైకి కొత్త పేరు....!

విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే విషయంలో భిన్న అభిప్రాయాలు వెలుపడుతున్నాయి. తాజాగా కన్వీనర్ పదవికి మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రతిపాదించారు. విపక్ష కూటమిని ఆయనైతేనే సరిగా నడిపించలగరని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

author-image
By G Ramu
New Update
విపక్ష కూటమి కన్వీనర్ రేసులో మరో నేత... తెరపైకి కొత్త పేరు....!

విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే విషయంలో భిన్న అభిప్రాయాలు వెలుపడుతున్నాయి. తాజాగా కన్వీనర్ పదవికి మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రతిపాదించారు. విపక్ష కూటమిని ఆయనైతేనే సరిగా నడిపించలగరని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

కూటమి కన్వీనర్ పదవికి రోజుకో పేరు తెరపైకి వస్తోంది. మొదట బిహార్ సీఎం నితీశ్ కుమార్ తెరపైకి వచ్చింది. కూటమి కన్వీనర్ పదవిని ఆయన కోరుకుంటున్నారని మొదట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని వెల్లడించారు. విపక్ష పార్టీలను ఏకతాటి పైకి తీసుకు రావడమే తన లక్ష్యమని వెల్లడించారు.

ఈ క్రమంలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్టేనని తేలి పోయింది. దీంతో విపక్ష కూటమికి మల్లిఖార్జున ఖర్గే లేదా కాంగ్రెస్ కు చెందిన నేత సారథ్యం వహించాలని జేడీయూ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి మరికొన్ని పార్టీలు కూడా వంత పాడాయి. ఇక కన్వీనర్ గా మల్లిఖార్జున ఖర్గే నియామకం లాంఛన ప్రాయమేనన్నారు. కానీ తాజాగా అనూహ్యంగా అరవింద్ కేజ్రీవాల్ తెరపైకి వచ్చింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల సమస్యలను లేవనెత్తారని, దేశ రాజధానిలో ద్రవ్యోల్బణం అత్యల్పంగా ఉన్న ఒక నమూనాను అందించారని ప్రియాంక కక్కర్ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న నేత అరవింద్ కేజ్రీవాల్ అని ఆమె అన్నారు. విపక్ష కూటమి మూడవ సమావేశం జరగనున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

also read: మీరెవ్వరూ నాకొద్దు..సింహం సింగిల్ గానే బరిలోకి.!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment