Suryapet: మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. మళ్లీ అదే హాస్టల్!

మరో గురుకుల విద్యార్థిని దారుణానికి పాల్పడింది. సూర్యపేటలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇరుగు అస్మిత హైదరాబాద్ లోని తమ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. కూతురు ఆకస్మిక మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Suryapet: మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. మళ్లీ అదే హాస్టల్!

Hyderabad: రాష్ట్రంలో గురుకుల విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఇటీవలే సూర్యపేటలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా మరోసారి అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ హాస్టల్ లో పదో తరగతి చవుదుతున్న ఇరుగు అస్మిత ( 15) అనే బాలిక ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది.

పదవ తరగతి విద్యార్థిని..
ఈ మేరకు పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం బురకచర్ల గ్రామ పరిధికి చెందిన ఇరుగు ఆనంద్ జ్యోతిల కూతురు ఇరుగు అస్మిత ప్రస్తుతం ఇమాంపేట గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే ఇటీవల అదే గురుకులకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాలలో ఫేర్వెల్ పార్టీ రోజు ఉరివేసుకొని చనిపోంది. దీంతో విద్యార్ధులు భయపడకుండా స్కూల్ కి కొన్నిరోజులు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలోనే సెలవులపై ఇంటికి వచ్చిన అస్మిత ఇవ్వాళ పాఠశాలకు వెళ్లాల్సి ఉండగా వెళ్లలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో హైదరాబాద్ లోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కూతురు ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇది కూడా చదవండి : South Korea: గొడ్డు మాంసంతో బియ్యం.. వరికంటే 8 శాతం అధిక ప్రొటీన్‌!

అనుమానాలకు తావిస్తోంది..
అయితే ఈ 15 రోజుల్లోనే నలుగురు గురుకు బాలికలు ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. భువనగిరి ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో భవ్య, వైష్ణవి అనుమానాస్పద మృతి చెందగా.. ఆ కేసు కొలిక్కి రాకముందే, సూర్యాపేట గురుకుల ఎస్సీ హాస్టల్లో ఉండే వైష్ణవి, అస్మిత అనే మరో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు