YV Subba Reddy: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం

వైసీపీ మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ (84) సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంతో ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి మృతి చెందారు.

New Update
YV Subba Reddy mother

YV Subba Reddy mother Photograph: (YV Subba Reddy mother)

వైసీపీ మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ (84) సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంతో ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిలో గత కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆమె నేడు కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం వైవీ సుబ్బారెడ్డి స్వగ్రామమైన మేదరమెట్లకు పిచ్చమ్మ పార్ధీవదేహాన్ని తరలిస్తారు.

ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్‌ సంచలనం!

దహన సంస్కరణలు అక్కడే..

అక్కడే దహన సంస్కరణలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే పిచ్చమ్మ పార్ధీవదేహానికి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిలతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen wines : వైన్ షాపులో పాస్టర్ ప్రవీణ్...రూ.950 ఫోన్ పే చేసి

పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రవీణ్‌ ఫోన్‌పే, పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి. ఎల్బీనగర్‌ సవేరా వైన్స్‌లో లిక్కర్ షాపులో మధ్యాహ్నం 12:  24 నిమిషాలకు రూ. 950 ఫోన్ పే చేసి రెండు టీన్స్ బాటిల్ కొనుగోలు చేశారు ప్రవీణ్ .

New Update

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రవీణ్‌ ఫోన్‌పే, పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి.  మార్చి 24వ తేదీ  ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తన బైక్ పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఆయన కోదాడ, ఏలూరులో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసినట్లుగా వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయి. ఇప్పుడు మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరే ముందు ఎల్బీనగర్‌ సవేరా వైన్స్‌లో లిక్కర్ షాపులో మధ్యాహ్నం 12:  24 నిమిషాలకు రూ. 950 ఫోన్ పే చేసి రెండు టీన్స్ బాటిల్ కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి స్ర్కీన్ షాట్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ముఖానికి మాస్క్ పెట్టుకుని మార్ట్ లోకి వెళ్లి లిక్కర్ కొనుగోలు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment