YS Jagan-Roja: రోజాకు బిగ్ షాక్ ఇచ్చిన జగనన్న.. అక్కడి నుంచి ఔట్!

రోజాకు జగన్ బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ కుమారుడు జగదీష్ YCPలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రోజాను తప్పించి జగదీష్ కు నగరి నియోజవర్గ బాధ్యతలను అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.

New Update
YS Jagan RK Roja

YS Jagan RK Roja

వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాకు చెక్ పెట్టేందుకు పార్టీలోని ఆమె ప్రత్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ కూడా దక్కకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? నగరి నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ సోదరుడు గాలి జగదీష్‌ గత కొన్ని రోజులుగా వైసీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జగన్ కూడా ఇందుకు ఓకే చెప్పారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు అంటే ఫిబ్రవరి 12న జగన్ సమక్షంలో జగదీష్ వైసీపీ కండువా కప్పుకుంటారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఇందుకోసం జగదీశ్ మంగళవారమే విజయవాడ కూడా చేరుకున్నట్లు చర్చ జరిగింది. కానీ ఏమైందో కానీ ఆయన చేరిక జరగలేదు. అయితే.. జగదీష్ చేరికను రోజా అడ్డుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. జగదీష్ ను తీసుకువచ్చి నగరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా చేయాలన్నది రోజా ప్రత్యర్థుల వ్యూహంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన రోజా.. ఇలా జరగడానికి వీళ్లేదని అధినేత, ముఖ్య నేతల వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగదీష్‌ చేరిక ఆగిపోయినట్లు తెలుస్తోంది.

గాలి కుటుంబానికి గట్టి పట్టు..

గాలి జగదీష్‌ తండ్రి ముద్దుకృష్ణమనాయుడు గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేయడంతో నియోజకవర్గంపై ఆయన కుటుంబానికి గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ముద్దుకృష్ణమ కుమారుడు భాను ప్రకాష్ కు గత రెండు సార్లు నగరి నుంచి టీడీపీ టికెట్ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో భాను ప్రకాష్‌ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రోజా విజయం సాధించారు. భాను ప్రకాష్‌ తమ్ముడు జగదీష్‌ తెరవెనుక వైసీపీకి మద్దతు ఇవ్వడంతోనే టీటీడీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైందన్న ప్రచారం కూడా ఉంది. గత ఎన్నికల్లో మాత్రం రోజా ఓటమి పాలై భాను ప్రకాష్ విజయం సాధించారు. 

గాలి కుటుంబంలో విభేదాలు..

ముద్దు కృష్ణమనాయుడి మరణం తర్వాత గాలి కుటుంబం రెండుగా చీలిపోయింది. గాలి పెద్ద కుమారుడు భాను ప్రకాష్‌ ఒక వైపు, రెండో కుమారుడు జగదీష్‌, ఆయన తల్లి మరో వైపు ఉంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు సైతం ఈ ముగ్గురిపై సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. మీరు ఏకాభిప్రాయానికి రాకపోతే టికెట్ ను బయటి వారికి కేటాయించాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు చర్చ సాగింది. అయితే.. మాలో ఎవరికి ఇచ్చినా ఓకే అని వీరు ఏకాభిప్రాయానికి రావడంతో చంద్రబాబు భాను ప్రకాష్‌ కు కేటాయించారు. ఈ ఎన్నికల్లో కూడా జగదీష్ పట్టుబట్టినా.. భాను ప్రకాష్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు.  

జగన్ వ్యూహం అదే..

ప్రస్తుతం టికెట్ల అంశం పక్కకు పెట్టి నేతలంతా పార్టీ కోసం పని చేయాలని జగన్ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించాలని ఆయన నేతలకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులు, సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని తేల్చి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి జగదీష్‌ ను చేర్చుకోవడానికే జగన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

రోజా ఒప్పుకుంటారా?

జగదీష్‌ ను చేర్చుకోవడానికి మాజీ మంత్రి రోజా ఏ మాత్రం ఒప్పుకునే అవకాశం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఒక వేళ జగదీష్‌ ను చేర్చుకున్నా.. ఆయనను నగరికి దూరంగా ఉంచాలని.. మరేదైనా నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని ఆమె స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. అయితే.. వైసీపీ ముఖ్య నేతలు మరో ఒకట్రెండు రోజుల్లో రోజాతో చర్చలు జరిపి ఆమెను ఒప్పించనున్నట్లు తెలుస్తోంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

Also Read :  కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

  • Apr 16, 2025 11:28 IST

    రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

    రీల్స్ పిచ్చితో ఓ మహిళ గంగానదిలో కొట్టుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని మణికర్ణిక ఘాట్ వద్ద రీల్స్ కోసం గంగానదిలో దిగగా.. కాలు జారింది. ఇదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుని మృతి చెందింది. పోలీసులు ఇప్పటికీ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు.

    viral video up
    viral video up

     



  • Apr 16, 2025 09:34 IST

    హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

    హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి. 

    ed



  • Apr 16, 2025 09:20 IST

    షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుమారుడు సజీబ్‌ వాజిద్‌కు కోర్టు అరెస్టు వారంట్లు జారీచేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారంట్లు జారీచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో వీరిపై అరెస్ట్ వారంట్లు జారీ చేసింది.

    sheikh Hasina
    sheikh Hasina

     



  • Apr 16, 2025 09:19 IST

    ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

    ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

    EC



  • Apr 16, 2025 07:26 IST

    పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

    తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.



  • Apr 16, 2025 07:25 IST

    కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?



  • Apr 16, 2025 07:25 IST

    మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

    అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

    earthquake



Advertisment
Advertisment
Advertisment