YSRCP: వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. హత్య కేసులో కుమారుడి అరెస్ట్!

వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకుని అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

New Update
ycp

AP Crime : దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు.  తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకుని అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు సమాచారం.

Also Read: పొంచి ఉన్న తుపాన్ ముప్పు..తెలంగాణలో వానలే వానలు!

Pinipe Viswarup Son Srikanth Arrest

ట్రాన్సిట్‌ వారెంట్‌ పై ఏపీకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అరెస్ట్ ను రాష్ట్ర పోలీసు అధికారులు నిర్థారించాల్సి ఉంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండే ళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపె శ్రీకాంత్‌ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు సమాచారం. కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ ను 2022 జూన్‌ 6న హత్య చేయించినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. 

Also Read: యహ్యా సిన్వార్ ఓ కసాయే...అడ్డొస్తే చంపేయడమే!

ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ , మృతుడికి స్నేహితుడైన వడ్డీ ధర్మేశ్‌ ను పోలీసులు విచారించారు. అతడిని ఈ నెల 18న అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాటు పినిపె శ్రీకాంత్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మధురైలో శ్రీకాంత్‌ ను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

ఈ నెల 18న ధర్మేశ్‌ ను విచారించి , వివరాలు సేకరించినట్లు తెలిసింది. అతడు..మృతుడు దుర్గాప్రసాద్‌, శ్రీకాంత్‌ లకు సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారని పోలీసులు నిర్థారణకు వచ్చారు. దుర్గాప్రసాద్‌ ను హత్య చేయించేందుకు నిర్ణయించిన శ్రీకాంత్‌...ధర్మేశ్‌ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read: బాచుపల్లిలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..!

హత్యకు స్థానికంగా ఓ ప్రముఖ లాడ్జిలో పథకం వేశారు. దుర్గా ప్రసాద్‌ ను ధర్మేశ్‌ కోటిపల్లి రేవు వద్దకు ద్విచక్ర వాహనం పై తీసుకెళ్లగా , వెనుక కారులో నలుగురు ఫాలో అయ్యారు. రేవు వద్ద ఓ వ్యక్తి పడవలో లోపలకు తీసుకెళ్లగా , కారులో వచ్చిన వారిలో ముగ్గురు దుర్గా ప్రసాద్‌ మెడకు తాడు బిగించి, హత్య చేశారని నిందితుడు ధర్మేశ్‌ చెప్పినట్లు సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు ముందుకు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

Also Read: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి

కొన్నాళ్లకు మృతదేహం లభించడం , పోస్టుమార్టంలో హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Suspicious deaths : శ్రీకాకుళం జిల్లాలో దారుణం..నిన్న కూతురు..ఈ రోజు అమ్మ..అమ్మమ్మ

విజయనగరం జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు శ్రీకాకుళం జిల్లాలోని ఒక బావిలో శవాలై తేలారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. వీరిని డెంకాడకు చెందిన వరలక్ష్మి (కూతురు), సరస్వతి (తల్లి) గా గుర్తించారు.

New Update
death

Suspicious deaths in srikakulam

Suspicious deaths : విజయనగరం జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు శ్రీకాకుళం జిల్లాలోని ఒక బావిలో శవాలై తేలారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన వరలక్ష్మి (కూతురు), సరస్వతి (తల్లి) ఇద్దరూ  శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం గూడెం గ్రామం వద్ద బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  అయితే వీరి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది.

Also read :  Subham Trailer పెళ్ళాల సీరియల్ పిచ్చికి బలైన మొగుళ్ళు.. సామ్ స్పెషల్ ఎంట్రీ అదుర్స్! ట్రైలర్ చూశారా
 
 ఈ నెల 24 వ తేదీన విశాఖ జ్ఞానాపురం చెర్చిలో వరలక్ష్మి కుమార్తె చంద్రిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక ముఖానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉండడంతో ఆ బాలిక మృతి కలకలం రేపింది. అంతకు ముందు ఆ బాలికకు గాలి సోకిందని చర్చికి తీసుకువెళితే నయమవుతుందని ఆమె తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఏమైందనేది తెలియదు కానీ ఆ బాలిక మరణించింది. అయితే, తనకు తెలియకుండా తన కూతురును చర్చికి తీసుకెళ్లారని బాలిక తండ్రి నిన్నటి రోజున ఆరోపించాడు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు పోలీసులు బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకుని విచారణ చేసి వదిలేశారు.

Also Read: CSK : పెద్ద ప్లేయర్స్ ఆడటం లేదు..నేనేం చేయాలి..ధోని

అయితే కుమార్తె మృతిపై విశాఖ పోలీసులకు వరలక్ష్మినే ఫిర్యాదు చెసినట్లు మరికొంతమంది చెబుతున్నారు. ఈ క్రమంలో  గూడాంలో మృతుల దూరపు బంధువు ఇంటికి వచ్చే క్రమంలో వీరిని హతమార్చి బావిలో పడేశారని ప్రచారం సాగుతోంది.  మరోవైపు తమ కూతురు మరణానికి తనతో పాటు తన తల్లి కారణమని పోలీసులు అనుమానించడంతో పాటు మరోసారి విచారణకు పిలుస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే వారు పోలీసుల కేసుకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెవరైనా చంపారా అనేది మిస్టరీగా మారింది.  అయితే బాలిక మృతికి కారణాలు తెలిస్తే వీరిద్ధరి మరణానికి కారణాలు బయటపడుతాయని స్థానికులు అంటున్నారు. 

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

కాగా వీరిద్దరినీ ఎవరో హతమార్చి నేలబావిలో పడేసారని అనుమానిస్తున్న పోలీసులు కి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. విచారణ చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో మిస్టరీన ఛేదించే పనిలో పడ్డారు. కాగా బావిలో తల్లీ్కూతుళ్ల మృతదేహాలు లభ్యం కావడంతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Also Read : Chhattisgarh : స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

 

Advertisment
Advertisment
Advertisment