అది అబద్ధం అని ప్రమాణం చేస్తారా? విజయసాయిరెడ్డికి షర్మిల సంచలన సవాల్!

'సాయి రెడ్డి గారు.. మీరు చదివింది జగన్ గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ?'.. అంటూ విజయసాయిరెడ్డిపై షర్మిల ట్వీట్ చేశారు.  

New Update
Vijayasaireddy Sharmila

'సాయి రెడ్డి గారు.. మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ?'.. అంటూ విజయసాయిరెడ్డిపై షర్మిల ట్వీట్ చేశారు.  వైఎస్ మృతికి కారణమైన చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపారంటూ ఈ రోజు విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ ఉన్నప్పుడే షర్మిలకు ఆస్తులు పంచారన్నారు. చెల్లిపై ప్రేమతో జగన్ తన ఆస్తిలో 40 శాతం వాటా ఇస్తానన్నారన్నారు. కోర్టు కేసుల తర్వాత ఈ ఆస్తులు ఇస్తానని చెప్పాడన్నారు. కానీ జగన్ ను జైలుకు పంపించడానికి చంద్రబాబుతో షర్మిల లాలూచీ పడ్డారని ఫైర్ అయ్యారు.  ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేశారు. 
ఇది కూడా చదవండి: AP CABINET MEET: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ!

Also Read :  చీరలో జూనియర్ అతిలోక సుందరి హొయలు ! ఫొటోలు చూస్తే ఫిదా

వైఎస్ పేరు ఛార్జిషీట్లో చేర్చించిందే జగన్..

జగన్ మోచేతి నీళ్లు తాగిన మీరు ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడుతారని విజయసాయిరెడ్డిని విమర్శించారు షర్మిల. వైఎస్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదన్నారు. ఇంకా వైఎస్ మరణానికి చంద్రబాబు కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్ పేరును ఛార్జిషీట్లో చేర్పించింది మీ నాయకుడు జగన్ కాదా? అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయట పడడానికి న్యాయవాది పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవన్నారు.
ఇది కూడా చదవండి: అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి

అందుకే నా కొడుకు పెళ్లికి చంద్రబాబును పిలిచా..

వైఎస్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారని గుర్తు చేశారు. అలాగే తాను కూడా చంద్రబాబును పిలిచానన్నారు. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి? అంటూ ఫైర్ అయ్యారు. జగన్ కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా? అని ఫైర్ అయ్యారు. జగన్ అద్దంలో చూసుకున్నా చంద్రబాబే కనిపిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. 

Also Read :  గంజాయి ముఠా గుట్టురట్టు.. 105 కేజీల డ్రగ్స్ స్వాధీనం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment