జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే

జగన్ కు సొంత జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. జమ్మలమడుగు నియోజకవర్గ ఇంచార్జి వ్యవహారం కొలిక్కి రాలేదు. సుధీర్ రెడ్డి సమావేశం నుంచి మధ్యలోనే అలిగి వెళ్లి పోగా.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జగన్ నిర్ణయానికి వదిలేశారు.   

New Update
dfdf d

YS Jagan: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలకనేతలంతా పార్టీని వీడి వెళ్తుండగా మరోవైపు కుటుంబ కలహాలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న జగన్ కు సొంత జిల్లా నేత షాక్ ఇచ్చాడు. మూడు రోజులపాటు కడప ఇడుపుల పాయలో పర్యటించిన జగన్.. జమ్మలమడుగు నియోజకవర్గ ఇంచార్జి వ్యవహారంపై చర్చలు జరిపినా కొలిక్కి రాకపోవడం చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలకు చెరో మూడు మండలాల ప్రతిపాదనను జగన్ ప్రస్తావించగా వారు తిరస్కరించారు. సుధీర్ రెడ్డి సమావేశం నుంచి మధ్యలోనే అలిగి వెళ్లి పోగా.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జగన్ నిర్ణయానికి వదిలేశారు. 

ఇది కూడా చదవండి:  VIRAT: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం

రామసుబ్బారెడ్డికే జగన్ మొగ్గు.. 

ఈ క్రమంలోనే ఇడుపులపాయ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు యాలహంకకు పయనమైన జగన్.. వీరిద్దమరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలు ఎంపీ అవినాష్ కు అప్పగించారు. అయితే మరో రెండు రోజుల్లో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. నియోజకవర్గ ఇంచార్జి రామసుబ్బారెడ్డి అయితేనే పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి, చిన్నానలు దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి, మనోహర్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డితో కుటుంబ పెద్ద ప్రకాష్ రెడ్డితో జగన్ ఏకాంతంగా చర్చలు జరిపారు. ప్రకాష్ రెడ్డి ఇంటికి ఒక్కడే వెళ్ల ఆస్తుల వివాదంపై సుధీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: Ben Stokes: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దోపిడీ.. మెడల్‌ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment