Vijayawada : బుడమేరుకు ఏ క్షణమైనా వరద!
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ సోమవారం పలు జిల్లాల పాఠశాలలకు సెలవు ప్రకటించింది. పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాల్లో స్కూల్స్ బందు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. చట్టం అమల్లోకి రాగానే మొట్ట మొదటగా బుడమేరు ఆక్రమణలే తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్థానిక ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
AP: విజయవాడలో వరదలపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద వస్తుందని తమకు ముందే తెలుసన్నారు. వరద గురించి చెప్పిన పట్టించుకోరని ప్రజలకు చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం సిసోడియా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి.
AP: ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవుల యజమానుల ఆచూకీ పోలీసులు కనుక్కున్నారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఆధ్వర్యంలో ఈ పడవలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుట్ర కోణం వెలికితీసేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
AP: విజయవాడలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.
విజయవాడలో బుడమేరు గండ్లను అధికారులు పూడ్చివేశారు. భారీ వర్షాలకు ప్రవాహం పెరిగి బుడమేరు వాగుకు మూడు గండ్లు పడగా.. విజయవాడను వరద ముంచెత్తింది. ఈ గండ్లను పూడ్చివేసేందుకు ఏజెన్సీలతో పాటు చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు కృషి చేశారు.
మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి నారా లోకేష్ అభినందించారు. బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులను పరిశీలించిన లోకేష్.. మంత్రి నిమ్మల పడిన కష్టాన్ని గుర్తించి శభాష్ అని ప్రశంసించారు. 64 గంటల పాటు నిద్రాహారాలు లేకుండా నిమ్మల చేసిన పనితీరును మెచ్చుకున్నారు.