Sharmila: లడ్డూ వివాదంపై సీబీఐ ఎంక్వైరీ వేయండి‌‌–పీసీసీ ఛీఫ్ షర్మిల

తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రిపోర్టు కావాలని ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను  పీసీసీ చీఫ్‌ షర్మిల  విజ్ఞప్తి చేశారు. సీబీఐ ఎంక్వైరీకి రికమెండ్ చేయాలని ఆమె గవర్నర్‌ను కోరారు.

author-image
By Manogna alamuru
New Update
laddu

PCC Chief Sharmila: 

తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రిపోర్టు కావాలని ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను  పీసీసీ చీఫ్‌ షర్మిల  విజ్ఞప్తి చేశారు. సీబీఐ ఎంక్వైరీకి రికమెండ్ చేయాలని ఆమె గవర్నర్‌ను కోరారు. ఆధారాలతో నేరం నిరూపితమైతే రాజకీయాలకతీతంగా, స్థాయితో సంబంధం లేకుండా వారిని కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు.

దీనిపై షర్మిల మాట్లాడుతూ..లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద గవర్నర్ ను కలిశామని..కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది, చాలా సెంటిమెంట్ అంశం అని వివరించామని తెలిపారు. ఏ మతమైనా గొప్పది,ఏ ధర్మం అయినా గొప్పది. అన్ని మతాలను గౌరవించాలి. కోట్ల మంది ప్రజలు ఇప్పుడు బాధలో ఉన్నారు. రెండు అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. NDDB రిపోర్ట్ ప్రకారం లడ్డూ లో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది. ఫిష్,బీఫ్,పిగ్ కొవ్వుల నూనె ఉందని తేలింది. భక్తులకు పంపిణీ చేసే నెయ్యి 320 కే కొనడం ఏంటి ? అంటూ పీసీసీ ఛీఫ్ షర్మిల ప్రశ్నించారు. స్వామి ప్రసాదానికి వాడే నెయ్యి 16 వందలకు కొంటున్నారు. 
స్వామి ప్రసాదాన్ని అంత రేటుకి కొని భక్తులకు ఇచ్చే లడ్డుల్లో తక్కువ రేటు నెయ్యి వాడతారా? 320 కి కొనేది నెయ్యినా ? లేక నూనేనా ? ఇంకా ఏమైనా ఉందా ? ఇక్కడే అసలు విషయం తెలుస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
జులై 23 న రిపోర్ట్ వస్తె బాబు ఇంతకాలం ఎందుకు దాచారు ? లడ్డూ కల్తీ పై సమగ్ర దర్యాప్తు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసినాకూడా కేంద్ర సంస్థలతో కూడా దర్యాప్తు చేయించాలి. దీని కోసమే గవర్నర్‌‌ను కలిశామని ఇవరించారు షర్మిల. లడ్డూ వివాదం మీద CBI తో విచారణ చేయించాలని కోరాం. లడ్డూ కల్తీ పై భాద్యులు ఎవరో తేల్చాలి. స్వామి వారి ఆదాయం దాదాపు ఏడాదికి 3 వేల కోట్లకు పైగానే ఉంటుంది. ఆయన సంస్థల విలువ 3 లక్షల కోట్లకు పైనే..ప్రపంచలోనే వేంకటేశుడు అత్యధిక ధనవంతుడు. మరి అలాంటి ఆయన లడ్డూను కల్తీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ? అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి దర్యాప్తు చేయాలని అడిగే హక్కు లేదు.  కల్తీ జరిగింది వాళ్ళ పాలనలోనే..వాళ్ళే తక్కువ కోడ్ చేసిన కంపెనీకి ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు ? 320 కి నెయ్యి వస్తుందో, నూనె వస్తుందో తెలియదా ? అంత తెలియకుండా ఉన్నారా అంటూ మండిపడ్డారు. అందుకే చెబుతున్నాం..లడ్డూ వివాదంపై విచారణ పూర్తి స్థాయిలో జరగాలి. కల్తీకి ఎవరు పాల్పడ్డారు అనేది తేల్చాలి. దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ పీసీసీ షర్మిల అన్నారు.

Also Read: Tirupathi: తిరుపతిలో మూడు రోజుల పాటూ మహా శాంతి యాగం‌‌–టీటీడీ నిర్ణయం

Advertisment
Advertisment
తాజా కథనాలు