NBK: కన్నీరు పెట్టుకున్న బాలకృష్ణ

హిందూపూర్ కు చెందిన టీడీపీ నాయకుడు వెంకటస్వామి ఇటీవల మరణించగా.. నేడు బాలకృష్ణ వారి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అండగా ఉంటానని వెంకటస్వామి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.

New Update
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు తన సొంత నియోజకవర్గం హిందూపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడు వెంకటస్వామి మరణించగా వారి ఇంటికి వెళ్లారు బాలకృష్ణ. వెంకటస్వామి కుటుంబానికి నివాళులు అర్పిస్తూ భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ రోజు ఉదయం హిందూపూర్ లో ఆధునికరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని సైతం బాలకృష్ణ ప్రారంభించారు.

చాలా రోజులుగా డాకు మహారాజ్ తో బిజీ..

చాలా రోజులుగా డాకు మహరాజ్ సినిమా చిత్రీకరణ, రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్ పనుల్లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సంబరాలు సైతం జరుపుకున్నారు. ఈ సినిమా హడావుడి ముగియడంతో బాలయ్య ప్రస్తుతం హిందూపూర్ లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న అఖండా-2 సినిమాలో బాలకృష్ణ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవల మహాకుంభమేళాలో నిర్వహించారు. నిజమైన అఘోరాలతో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. మరికొన్ని రోజుల్లో బాలకృష్ణతో షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. బాలయ్యతో వరుస హిట్లు ఇస్తున్న తమన్ ఈ సినిమాకు కూడా సంగీత సారథ్యం వహించనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment