TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు

వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరగనుండటంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అలాగే కేవలం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇవనున్నట్లు తెలిపింది.

New Update
11

తిరుమలలో వైకుంఠ ఏకాదశి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు.

ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే..

ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ తెలిపింది. అలాగే ప్రోటోకాల్ ప్రముఖులు కాకుండా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 

ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల

ఉత్తర ద్వారా దర్శనం జరగనున్న పది రోజుల పాటు గోవిందమాల భక్తులకు, వృద్ధులు, దివ్యాంగులు, పిల్లలకు, ఎన్‌ఆర్‌ఐ వంటి దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఛైర్మన్లకు కూడా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనాలకు ఎలాంటి అనుమతి ఉండదని తెలిపింది.

ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!

సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టోకెన్లు తీసుకున్న భక్తులు వారి టైమ్‌స్లాట్ ప్రకారం మాత్రమే కూల్యైన్ల దగ్గరకు వెళ్లాలని టీటీడీ సూచించింది. రోజుకి కొంత లిమిట్ ప్రకారం మాత్రమే టోకెన్లు ఇస్తారు. కొండ కింద పలు ప్రదేశాల్లో టోకెన్లు ఇస్తారు. వీటికి తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి. 

ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

New Update

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏపీలో విమాన సర్వీస్‍ల జాప్యంపై గంటా శ్రీనివాస్ నిన్న ట్వీట్ చేశారు. ఏపీ టూ ఏపీ వయా తెలంగాణ అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో స్పందించిన టీడీపీ హైకమాండ్.. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు రామ్మోహన్‍కి ఫోన్ చేయొచ్చు కదా..? అని ఫైర్ అయినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావొద్దని గంటాకు టీడీపీ హై కమాండ్ స్పష్టం చేసినట్లు చర్చ సాగుతోంది. 

ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..

విశాఖ నుంచి అమరావతికి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని నిన్న గంటా ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ''ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టు లో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు...

విశాఖ - విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి''.. అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సొంత పార్టీ అధికారంలో ఉండడం.. నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేసే ఛాన్స్ ఉన్నా గంటా సోషల్ మీడియాకు ఎక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో హైకమాండ్ ఆయనకు వార్నింగ్ ఇచ్చింది.

Advertisment
Advertisment
Advertisment