Arasavilli temple: మూల విరాట్ ను తాకని సూర్యకిరణాలు.. నిరాశతో వెనుదిరిగిన జనం

సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి మారే సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది 9, 10  తేదీల్లో తెల్లవారుజామున భానుడి కిరణాలు అరసవల్లి ఆలయంలోని మూల విరాట్టును తాకడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు.

New Update
 Arasavilli temple

Arasavilli temple

Arasavilli temple:  సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి మారే సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది 9, 10  తేదీల్లో తెల్లవారుజామున భానుడి కిరణాలు అరసవల్లి ఆలయంలోని మూల విరాట్టును తాకడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఆ అవకాశం ఉందని ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ప్రకటించారు. ఆదివారం కావడం, అదే రోజు సూర్యకిరణాలు తాకనుండటంతో ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానీ భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ నేడు సూర్యకిరణాలు మూల విరాట్‌ను తాకలేదు.

Also Read: Peanuts Peel: పల్లీల పొట్టుతో కూడా పుట్టెడు లాభాలు.. ఏంటంటే?

 మబ్బులు, పొగమంచు కారణంగా కిరణ స్పర్శకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా ప్రతీ ఏటా ఉత్తరాయణం మార్చి 9,10 తేదీలలోను దక్షిణాయణం అక్టోబర్ 1,2 తేదీలలో స్వామి వారి మూలవిరాట్టును సూర్య కిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. మరి సోమవారం అయినా భక్తులకు ఆ అదృష్టం దక్కుతుందో లేదో చూడాలి.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

సమస్త లోకాలకు వెలుగును ప్రసరింపజేసే సూర్యదేవాలయం  కలింగ నిర్మాణ సైలిలో నిర్మించబడింది.ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగ వంశానికి చెందిన దేవేంద్ర వర్మ రాజు నిర్మించాడు. ఈ అద్భుతమైన కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. సూర్యకిరణాలు నెలల్లో రెండుసార్లు దేవుని పాదాలపై పడే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. సమస్త జగతికి చైతన్యాన్ని కలిగించే సూర్య భగవానుని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపంగా విరాజులుతున్న సూర్య భగవంతుడు బ్రహ్మ విష్ణు స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి. సూర్యుని ఆరోగ్య ప్రదాతగా ప్రజలు కొలుస్తారు. అటువంటి సూర్యుని ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది.

ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

సూర్యోదయం సూర్యుని కిరణాలు దేవస్థానం ప్రాంగణంలోని అని వెట్టి మండపం సుదర్శన ద్వారా మధ్యలో నుండి సూర్యుని తొల కిరణాలు గర్భగుడిలోని మూలవిరాటును తాకి గొప్ప తేజస్సును ప్రజ్వలింప చేస్తాయి ప్రతి సంవత్సరం మార్చి 9,10, 11 ,12 అక్టోబర్ 1, 2 ,3 తేదీలలో ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది ఈ అపురూపమైన దృశ్యం తిలకిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం.అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.ఈరోజు కోసం సూర్యదేవుని భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి విశేషమైన పర్వతనం ఈ రథసప్తమి.సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి పర్వదినాన్ని జరుపుతారు.

Also Read: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment