Road Robbery : నంద్యాల శివారులో రెచ్చిపోయిన దారి దోపిడి దొంగలు

నంద్యాలలో దారి దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. రైతునగర్ వద్ద వాహనదారుడి పై దొంగలు దాడి చేసి దోచుకున్నారు. దారిలో వెళ్తున్న కారుపై రాళ్లతో దాడిచేసిన దుండగులు కారు ఆపగానే డ్రైవర్ ప్రభాస్ పై కత్తులు, కట్టెలతో దాడి చేశారు. దీంతో ప్రభాస్ తీవ్రంగా గాయపడ్డాడు.

New Update
Road Robbery in Nandyal

Road Robbery in Nandyal

Road Robbery : నంద్యాలలో దారి దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. శివారుప్రాంతాల్లో మాటువేసి దారి వెంట వెళ్లేవారిపై దాడి చేసి అందినకాడికి దోచుకుని ఉడాయిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతునగర్ వద్ద వాహనదారుడి పై దొంగలు దాడి చేసి దోచుకున్నారు. దారిలో వెళ్తున్న కారుపై రాళ్లతో దాడిచేసిన దుండగులు కారు ఆపగానే డ్రైవర్ ప్రభాస్ పై కత్తులు, కట్టెలతో దాడి చేశారు. దీంతో ప్రభాస్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ప్రభాస్ ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముసుగులు ధరించిన దొంగలు దాడికి పాల్పడ్డట్టు బాధితుడు తెలిపాడు. కాగా నంద్యాల తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నంద్యాల రహదారిలో ఈ మధ్యకాలంలో మరుసగా దారి దోపిడీలు జరగడం సంచలనం రేపుతోంది.

 కాగా కర్నూలు-నంద్యాల రహదారిలో శాంతిరామ్‌ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై గత ఆదివారం రాత్రి దారిదోపిడీ దొంగలు దంపతులపై దాడి చేశారు. భార్యాభర్తలపై కత్తులతో దాడిచేసిన దొంగలు వారిని తీవ్రంగా గాయపరిచారు. పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన దామరేకుల పెద్దన్న, జయమ్మ దంపతుల కుమార్తె గర్బిణీ కావడంతో చికిత్సకోసం ఆదివారం శాంతిరాం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్ల సూచన మేరకు రాత్రి అక్కడే ఉంచారు.

జయమ్మ బహిర్బూమి కోసం భార్యభర్తలు ఆసుపత్రి సమీపంలోని ఓ పొలం వద్ద ఆగిఉండగా అక్కడే ఉన్న దొంగలు ముందుగా పెద్దన్నపూ కత్తితో తల, కాళ్లపై దాడిచేశారు. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడే పడిపోయాడు. అనంతరం కేకలు వేస్తున్న జయమ్మను చితక బాదారు. ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కుని పరారయ్యారు.అతికష్టం మీద భర్తను తీసుకుని ఆసుపత్రికి చేరుకుంది. కాగా వారికి ఆస్పత్రి వర్గాలు చికిత్స అందించాయి. ఈ ఘటన జరిగి వారం కాక ముందే మరోసారి దారి దోపిడి జరగడం కలకలం రేపింది.

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment