AP News: కుటుంబ సభ్యుల వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు (మం) భగ్గేశ్వరంలో 6 నెలల గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితమే జనార్ధన్, దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు. కట్నం కోసం అత్తమామలు, భర్త వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update

AP News: నేటికాలంలో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య రోజూరోజుకు పెరిగిపోతున్నాయి. వారసుడు కావాలంటూ కొందరు, అదనపు కట్నం కోసం మరికొందరు కిరాతకులు తమ భార్యల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఓ గర్భిణి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లో వెళ్తే.. పాలకొల్లు మండలం భగ్గేశ్వరానికి చెందిన జనార్దన్, దేవి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. అయితే.. కొన్ని రోజులుగా అత్తామామలు, భర్త తమ బిడ్డ దేవిని అదనపు కట్నం కోసం వేదిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగలోకి దిగిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment