posani : పోసానికి బిగ్ షాక్.. నరసరావుపేటకు తరలింపు!

రాజంపేటలో నమోదైన కేసు తరహాలోనే పల్నాడు జిల్లా నరసరావుపేటలోనూ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. దీంతో నరసరావుపేట పోలీసులు కోర్టు అనుమతితో రాజంపేట జైలు నుంచి పీటీ వారెంట్ పై పోసానిని తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 15కు పైగా కేసులు నమోదయ్యాయి.

New Update
posani

నటుడు పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్ తగిలింది.  ఆయన్ను నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ప్రస్తుత రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసానిపై పీటీ వారెంట్ ఇచ్చారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేట కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు. నరసరావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో పోసానిని నరసరావుపేటకు తరలిస్తున్నారు పోలీసులు. 

పోసానిపై 15కు పైగా కేసులు

డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నరసరావుపేట పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు చేయడంపై బీఎన్ ఎస్ యాక్ట్ 153-ఎ, 504, 67 ఐటీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 15కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో పోసాని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

 కాగా కూటమిలోని కీలక నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్,లోకేష్  పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఇప్పటికే రాజంపేట పోలీసులు  పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కడప కోర్టులో పోసాని తరుపున ఆయన లాయర్లు ఇవ్వాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

అస్వస్థతకు గురయ్యారని వార్తలు

పోసాని కృష్ణమురళి  ఇటీవల అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి. అయితే  పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా అని అన్నారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. ఉదయం నుంచి పోసాని అనారోగ్యమంటూ నాటకం ఆడారని తెలిపారు.  పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని అన్నారు.  రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా కడప రిమ్స్‌లో కూడా పరీక్షలు చేయించామని తెలిపారు.  పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం  చేశారు.  దీంతో రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించామని వెల్లడించారు. 

జోగినేని మణి  ఫిర్యాదు మేరకు 

కాగా జనసేన నాయకుడు జోగినేని మణి (Jogineni Mani) 2025 ఫిబ్రవరి 24వ తేదీన పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోసానిపై 196, 353(2), 111 రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ఫిబ్రవరి26వ తేదీన హైదరాబాద్‌లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి పోసానిని ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Also Read :  డేంజరస్ కెమికల్స్‌తో పాల తయారీ.. కల్తీని ఇలా కనిపెట్టండి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సారగ్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment