Buggana: మాజీ మంత్రి బుగ్గనకు బిగ్ షాక్!

AP: కర్నూలు డోన్‌లో మాజీ మంత్రికి బుగ్గనకు ఊహించని షాక్ తగిలింది. ఆయన వాకింగ్ చేయకుండా ఉండేందుకు పార్క్ గేటుకు అధికారులు  తాళాలు వేశారు. అధికారుల తీరుపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన దానికి తనను రానివ్వరా? అంటూ ఫైరయ్యారు.

New Update
BUGGANNA

Ex Minister Buggana Rajendranath:

కర్నూలు డోన్‌లో మాజీ మంత్రికి బుగ్గనకు ఊహించని షాక్ తగిలింది. బుగ్గనకు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. మార్నింగ్‌ వాక్‌ పేరిట బుగ్గన కొత్త కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజేష్‌తో బుగ్గన కలిసి వచ్చారు. ఆయన వాకింగ్ చేయకుండా గేటుకు అధికారులు  తాళాలు వేశారు. తాళాలు వేయడంతో అక్కడే కూర్చొని కాపీ తాగి వెళ్లారు బుగ్గన. తాను ప్రారంభించిన పార్క్‌ తాళాలు వేయడం ఏంటి? అని ప్రశ్నించారు. కోట్ల సుజాతమ్మ పద్ధతిగల రాజకీయం చేయడం నేర్చుకో అంటూ బుగ్గన ఫైర్ అయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment