AP News: వాహనాలు చోరీ చేసిన వ్యక్తి అరెస్టు

AP News:ఆటో తో సహా రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా యలమంచిలి సీఐ ధనుంజయరావు తెలిపారు. మంగళవారం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సావిత్రి తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో చోరీ వివరాలను వెల్లడించారు.

New Update
 Anakapalli

Anakapalli

AP News:  ఆటో తో సహా రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా యలమంచిలి సీఐ ధనుంజయరావు తెలిపారు. మంగళవారం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సావిత్రి తో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చోరీ వివరాలను వెల్లడించారు.

Also Read: మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే

అనకాపల్లి జిల్లా రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామానికి చెందిన సర్వసిద్ధి వరహాలు ఆటో డైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితేఈ నెల 8న అడ్డరోడ్డు జంక్షన్‌లో వరహాలు ఆటోతో ఉండగా ఒక వ్యక్తి వచ్చి యలమంచిలి వెళ్లి కూరగాయలు తీసుకురావాలని ఆటో మాట్లాడుకుని బయలుదేరారు. ఈ క్రమంలో యలమంచిలి లో దిమిలి రోడ్డు జంక్షన్ కూరగాయలు మార్కెట్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఆవ్యక్తి మార్కెట్‌ లోకి వెళ్లగా ఆటో డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లాడు. కాగా టీ తాగి వచ్చి చూసేసరికి తన ఆటోతో పాటు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మంగళవారం యలమంచిలి సమీపంలోని కల్కి పెట్రోల్ బంకు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటో డ్రైవర్‌పై అనుమానం వచ్చి విచారించినట్లు తెలిపారు. కాగా ఈ విచారణలో పట్టుబడ్డ వ్యక్తి అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపం కడ పాలెం గ్రామానికి చెందిన ఎరిపిల్లి కాసు బాబుగా గుర్తించారు. విచారణలో అతను అప్పటికే మరో రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆటోతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. మూడు రోజులలోనే ఈ కేసును ఛేదించామని సీఐ ధనుంజయరావు తెలిపారు.

Also Read: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment