Group 2 Exam: జిలకర బెల్లంతో పెళ్లి మండపం నుంచి గ్రూప్ 2 పరీక్షకు.. యువతి ఫొటో వైరల్

ఓ యువతి పెళ్లి మండపం నుంచి నేరుగా గ్రూప్ 2 పరీక్ష కేంద్రానికి వెళ్లిన ఫొటో వైరల్ అవుతోంది. మమత అనే యువతికి చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం వివాహం జరిగింది. అదే రోజు పరీక్ష ఉండడంతో పెళ్లి ముగిసిన వెంటనే అవే బట్టల్లో పరీక్షకు హాజరైంది.

New Update
attended group 2 in wedding attire

attended group 2 in wedding attire

Group 2 Exam:   ప్రభుత్వ కొలువు సంపాదించాలనే తన కలను నిజం చేసుకునేందుకు  ఒక యువతి నేరుగా పెళ్లి మండపం నుంచి ఎగ్జామ్ కి వెళ్ళింది. పెళ్లి జరిగిన గంటల్లోనే  పసుపు బట్టలు, తలపై జిలకర బెల్లంతో ఆమె కలలకు కొత్త దారులు వేసేందుకు బయలుదేరింది. కన్న కలలను నిజం చేసుకోవాలనే ఆమె డెడికేషన్ చూసినవారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.  తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ కేంద్రం దగ్గర జరిగిన ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. 

Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

పెళ్లి బట్టల్లో గ్రూప్ 2 పరీక్షకు 

చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో మమత అనే యువతికి ఆదివారం ఉదయం వివాహం జరిగింది. అదే రోజు గ్రూప్ 2 పరీక్ష కూడా ఉండడంతో.. మమత పెళ్లి బట్టల్లోనే తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్ కి చేరుకుంది. వివాహం తర్వాత ఎక్కువ సమయం లేకపోవడంతో తలపై జిలకర బెల్లం, పూల జడ, పెళ్లి చీరతోనే పరీక్షకు హాజరైంది. 

Also Read: MAZAKA Trailer: నాన్న ఆంటీ.. కొడుకు అమ్మాయి.. నవ్వులే నవ్వులు 'మజాకా' ట్రైలర్! చూశారా

మొత్తం 175 కేంద్రాల్లో  92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉ.10 గంటల నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. మరోవైపు అభ్యర్థులు రోస్టర్ తప్పులను సరిచేసే వరకు గ్రూప్ 2 పరీక్ష వాయిదా  పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అర్థరాత్రి వరకు రోడ్లపై ధర్నాలకు దిగారు. ప్రభుత్వం వద్దని చెప్పిన వినకుండా ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Bhupalpally: అయ్యో! పాపం.. పాలు పట్టించిన గంటల్లోనే ఇద్దరు కవలలు మృతి! ఏమైందంటే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కువైట్‌లో ఏపీ మహిళపై యాసిడ్ దాడి.. పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి!

వైస్సార్‌కు చెందిన ఓ మహిళ పొట్టకూడు కోసం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లింది. ఇంట్లో పని చేస్తే నెలకు 150 దినార్లు జీతానికి ఒప్పందం చేసుకోగా.. ఆ తర్వాత 100 దినార్లు మాత్రమే ఇచ్చారు. దీంతో ఆ మహిళ యాజమానులను అడగడంతో యాసిడ్‌తో దాడి చేసి, పిచ్చాసుపత్రిలో చేర్చారు.

New Update
kuwait

kuwait Photograph: (kuwait)

జీవనం కోసం కువైట్ వెళ్లిన మహిళపై అక్కడ యజమానులు యాసిడ్ దాడి చేశారు. జీతం అడిగినందుకు.. ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందారు. దీంతో ఉపాధి కోసం ఆ మహిళ రెండు నెలల క్రితం వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్‌ ద్వారా కువైట్‌‌కి వెళ్లింది.

ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

నెల వేతనం ఎందుకు తక్కువ ఇచ్చారని..

అక్కడ ఓ ఇంట్లో పనిచేస్తే.. నెలకు 150 దీనార్లు వేతనం ఇవ్వడానికి ఒప్పందం పెట్టుకున్నారు. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత యజమానులు కేవలం 100 దీనార్లు వేతనం మాత్రమే ఇవ్వడంతో లక్ష్మి వారిని ప్రశ్నించింది. దీంతో యాజమానులు ఆగ్రహంతో ఆమెపై యాసిడ్‌ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ ఘటన జరిగి పది రోజులు అవుతుంది.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

బాధితురాలు ఆసుపత్రి యాజమాన్యానికి జరిగిన విషయం చెప్పడంతో తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెతో ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు చేయించారు. అయితే కేసు వెనక్కి తీసుకుంటేనే ఫాస్‌పోర్టు ఇస్తామని అంటున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదని, ప్రభుత్వం స్పందించి లక్ష్మిని సొంత గ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.

ఇది కూడా చూడండి:  Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

 

Advertisment
Advertisment
Advertisment