Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ బస్‌డిపో సమీపంలో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి జలకన్య ఎగ్జిబిషన్ ప్రాంగణం కాలి బూడిద అవుతోంది. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

New Update
vijayawada fire accident

vijayawada fire accident

Vijayawada Fire Accident:  విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యాధరపురం(Vidyadharapuram) ఆర్టీసీ బస్ డిపో(RTC Bus Depo) సమీపంలో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్‌(Jalakanya Exhibition)లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి జలకన్య ఎగ్జిబిషన్ ప్రాంగణం కాలి బూడిద అవుతోంది. ప్రమాదంపై సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికిు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే గ్యాస్ సిలిండర్‌ పేలి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు, సిబ్బంది భావిస్తున్నారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..




ఇది కూడా చదవండి: రాత్రి ఆలస్యంగా నిద్రిస్తున్నారా... ఈ తీవ్రమైన నష్టాలు తప్పవు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment