SVSN Varma: ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై వర్మ ఫస్ట్ రియాక్షన్.. సంచలన వీడియో!

టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి SVSN వర్మ స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానన్నారు. ఈ రోజు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Pitapuram SVSN Varma

Pitapuram SVSN Varma

ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ స్పందించారు. పార్టీ నిర్ణయానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. గత ఎన్నికల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యులంతా ఇంటింటికీ ప్రచారం చేసి కూటమి అభ్యర్థిని గెలిపించమే ఇందుకు నిదర్శనమన్నారు.  30 ఏళ్లుగా చంద్రబాబుతో తన ప్రయాణం సాగుతోందన్నారు. ప్రజా సేవ చేయడానికి ఇచ్చే అవకాశమే గొప్ప పదవి అని అన్నారు.

పార్టీ కోసం ప్రాణాలు అర్పిస్తాం..

పార్టీని కాపాడుకుంటామని, కార్యకర్తలపై ఈగ వాలినా ప్రాణాలు అర్పించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఒక జడ్పీటీసీ పదవి ఇవ్వడానికే మల్లగుల్లాలు పడుతూ ఉంటామన్నారు. రాష్ట్ర స్థాయిలో పదవులు పంపకం చేసే సమయంలో అధ్యక్షుడికి అనేక ఇబ్బందులు ఉంటాయన్నారు. అనేక సమీకరణలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు.

పవన్ కోసం టికెట్ త్యాగం..

పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. పొత్తుల్లో భాగంగా కూటమి నుంచి ఆ సీటు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగారు. దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ విజయం కోసం వర్మ అక్కడ పని చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వర్మకు టీడీపీ హైకమాండ్ ఆ సమయంలో హామీ ఇచ్చింది. ఇటీవల ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో వర్మకు పక్కాగా ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ పార్టీ విడుదల చేసిన లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీపై ఆయన తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. కానీ ఆ వార్తలకు తెరదించుతూ.. చంద్రబాబు నిర్ణయానికి కట్టబడి ఉంటానని ప్రకటించారు. 

#telugu-news #telugu-latest-news #pithapuram-svsn-varma #telugu breaking news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వాన...

Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది

New Update
Rains

Rains

ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా గురువారం పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొన్నిచోట్ల వడగాలులు వీచే అవకాశాలుకూడా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో బలపడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనికి అనుబంధంగా వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో గురువారం పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

గురువారం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం కూడా ఏపీలో వర్షాలు పడనున్నాయని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్య సాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు.

ఇదే సమయంలో కొన్ని జిల్లాలలో ఎండలు పెరుగుతున్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఉలిందకొండలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, నంద్యాల జిల్లా దొర్నిపాడు, పల్నాడు జిల్లా అమరావతిలో 39.7,ప్రకాశం జిల్లా దరిమడుగలో40.3 , చిత్తూరు జిల్లా తవణంపల్లెలో40.1  , వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో39.9 డిగ్రీల  ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని.. శుక్రవారం7 మండలాల్లో తీవ్రవడగాలులు, 66 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: GT Vs RR: గుజరాత్ తొలి ఇన్నింగ్స్ పూర్తి.. రాజస్తాన్ టార్గెంట్ ఎంతంటే?

ap | rains | weather | andhra pradesh weather | andhra-pradesh-weather-forecast | andhra-pradesh-weather-report | ap today weather update | ap-weather | AP Weather Alert | latest-news | telugu-news | ap telugu news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment