Viral Video: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం.. రంగంలోకి ట్రంప్ మామ- బ్యాన్ చేయాలంటూ!

అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించినట్లు మీమర్స్ ఓ వీడియో క్రియేట్ చేశారు. ‘కస్టమర్‌కు జరిగిన అవమానం గురించి నాకు చాలా బాధ కలిగింది. అందువల్ల అలేఖ్య చిట్టి పికెల్స్‌ను వెంటనే బాయ్ కాట్ చేయాలి’ అని చెప్పుకొచ్చారు.

New Update
donald trump responds to alekhya chitti pickles controversy

donald trump responds to alekhya chitti pickles controversy

అలేఖ్య చిట్టి పికెల్స్ ఆడియో వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గత రెండు రోజులుగా ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పచ్చళ్లు రేటు ఎక్కువగా ఉంది అని అడిగిన పాపానికి అలేఖ్య చిట్టి.. ఇద్దరు కస్టమర్లపై బూతులతో రెచ్చిపోయింది. ముష్టి పచ్చల్లే కొనలేనపుడు మీ బతుకులెందుకు అన్నట్లు మాట్లాడింది. అందుకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు అలేఖ్యపై రెచ్చిపోయారు. 

కస్టమర్లే మా దేవుళ్లు అని వీడియోలలో చెప్తూనే.. నిజ జీవితంలో అలేఖ్య బూతులతో రెచ్చిపోయిందని ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా మీమ్స్, ట్రోలింగ్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. వీడియోల్లో కనిపించే అలేఖ్య వేరు.. రియల్ లైఫ్‌లో అలేఖ్య వేరు అంటూ మండిపడుతున్నారు. జీవితంలో ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలే తప్ప తలపొగరు చూపించకూడదని హితవు పలుకుతున్నారు. 

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

ఈ వివాదంపై సోషల్ మీడియాలో ట్రోల్సో, విమర్శలు రచ్చ లేపుతున్నాయి. అలేఖ్య చిట్టి పికెల్స్ పై మీమ్స్ వరద పారుతోంది. మీమర్స్ తమ క్రియేటివిటీని బయటకు తీస్తున్నారు. అలేఖ్య పికిల్స్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవలసిందేనంటూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే మీమర్స్ తాజాగా మరో వీడియో చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also read :  పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!

ట్రంప్ ఏమన్నాడంటే?

మీమర్స్ ఈ వివాదంలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లాగారు. అలేఖ్య చిట్టి పికెల్స్ పై ట్రంప్ స్పందించినట్లు ఓ వీడియో క్రియేట్ చేశారు. అందులో ట్రంప్.. ‘‘అలేఖ్య చిట్టి పికెల్ కాంట్రవర్సీపై దించాలనుకుంటున్నాను. కస్టమర్‌కు జరిగిన అవమానం విని నాకు చాలా బాధ కలిగింది. అందువల్లనే నేను మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. అలేఖ్య చిట్టి పికెల్స్‌ను బాయ్ కాట్ చేయాలి. ఈ సంఘటన నుంచి వాళ్లు గుణపాఠం నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను’’ అంటూ ఆ వీడియోలో ట్రంప్ చెప్పినట్లు క్రియేట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 

Also Read : అయ్యో తల్లి.. నవరాత్రుల కోసం ప్లాన్.. పీరియడ్స్ రావడంతో సూసైడ్!

(alekhyaa chitti pickle | alekhya chitti pickles audio | alekhya chitti pickles controversy | america president trump | viral-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment