బోరుగడ్డ అనిల్‌కు స్టేషన్‌లో రాచమర్యాదలు.. మరో వీడియో వైరల్

గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో విచారణకు తీసుకొచ్చిన సమయంలో బోరుగడ్డ అనిల్ కు మరోసారి పోలీసులు రాచమర్యాదలు చేశారు. దగ్గరుండి కుర్చీలు వేసి అన్నం వడ్డించారు. పడుకోవడాని బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్స్ సమకూర్చారు.

New Update
Borugadda Anil Kumar

అమరావతి:

వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఇటీవల పోలీసులు రాచమర్యాదలు చేశారు. కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లి.. తిరిగి వస్తుండగా హోటల్ వద్ద ఆపారు. ఆపై అనిల్ కుమార్ కు గుమగుమలాడించే బిర్యాని తినిపించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో 7గురు పోలీసులను డీజీపీ సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు కూడా పోలీసులు మళ్లీ అదే తప్పు చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో మరోసారి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో విచారణకు తీసుకొచ్చిన సమయంలో బోరుగడ్డకు మరోసారి పోలీసులు రాచమర్యాదలు చేశారు. ఏకంగా సిబ్బంది దగ్గరుండి కుర్చీలు వేసి అన్నం వడ్డించారు.

Also Read : ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన

అంతేకాకుండా కూర్చోవడానికి స్టేషన్లో రైటర్ సీట్ కేటాయించారు. అక్కడితో ఆగకుండా పడుకోవడాని ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్స్ సమకూర్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

బోరుగడ్డకు పోలీసుల బిర్యానీ దావత్

దాడులు, దౌర్జన్యాలతో బోరుగడ్డ అనిల్ పై ఎన్నో కేసులు ఉన్నాయి. వీటికి తోడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై అసభ్యకర వ్యాఖ్యలు, అలాగే వారి కుటుంబ సభ్యులపై కూడా నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడటంతో మరిన్ని కేసులు నమోదు అయ్యాయి. ఇవి కాకుండా గతంలో తుళ్లూరు పోలీస్టేషన్ పరిధిలో నమోదైన రెండు కేసులకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న అనిల్ కుమార్ ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. 

Also Read :  సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు బయల్దేరారు. తిరిగి వెళుతున్న క్రమంలో గన్నవరం సమీపంలోని ఓ లగ్జరీ హోటల్ వద్ద ఆగి భోజనం చేశారు. కాగా పోలీసులు తమతో పాటు బోరుగడ్డ అనిల్ ను మర్యాదగా, గౌరవంగా లోపలకి తీసుకెళ్లారు. అక్కడితో ఆగకుండా తమతో పాటే అనిల్ కు మంచి భోజనం ఏర్పాటు చేయించారు. బిర్యానీ, చికెన్ లతో భోజనం పెట్టించారు. 

ఈ వ్యవహారాన్నంతటిని వీడియో తీస్తుండగా కొందరినీ బెదిరించారు. కానీ అప్పటికే వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది. ఇక ఈ విషయం డీజీపీ ద్వారకా తిరుమల రావు వద్దకు చేరుకోగా ఆయన పోలీసులపై తీవ్రంగా మండిపడ్డాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీపీ అరగంట వ్యవధిలోనే సంబంధిత ఏడుగురు పోలీసుల్ని సస్పెండ్ చేశాడు.

Also Read :  సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

Also Read: విజయవాడ to శ్రీశైలం సీ ప్లేన్ టూర్ ప్రారంభం.. నిమిషాల్లో చేరుకోవచ్చు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!

పవన్ భార్య అన్నా లెజినోవాపై జరుగుతున్న ట్రోలింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఘాటుగా స్పందించారు. పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ ఆమె హిందూ ధర్మాన్ని నమ్మారని చెప్పారు. అలాంటి మహిళను ట్రోల్ చేస్తే తాటా తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. 

New Update

Vijayashanthi: పవన్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్‌పై- కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి - ఘాటుగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ-- అన్నా.. హిందూ ధర్మాన్ని నమ్మారని పొగిడేశారు.- అగ్నిప్రమాదం నుంచి కొడుకు బయటపడినందుకు..-- కృతజ్ఞతగా శ్రీవారికి తల నీలాలు ఇచ్చారు.  అలాంటి మహిళను ట్రోల్ చేయడం తప్పు- అని మండిపడ్డారు. పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటా తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

అత్యంత అసమంజసం..

'దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు.  సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. 
హరహర మహాదేవ్. జై తెలంగాణ' అంటూ తన అభిప్రాయం వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

మార్క్‌ శంకర్‌పై కూడా ..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల వీరు హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ క్రమంలో కొందరు దుండగులు సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు భార్య అన్నా లెజినోవా.. కుమారుడు మార్క్‌ శంకర్‌పై కూడా సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. అయితే వీరిని గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు. అయితే వీళ్లు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment