Bomb Threatening Mails: తిరుపతిలోని హోటళ్లకు ఆగని బాంబ్ బెదిరింపులు!

తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ ఆగడం లేదు. వరుసగా మూడో రోజు ఉగ్రవాద సంస్థలు మెయిల్స్‌ పంపాయి. జాఫర్‌ సాదిక్‌ పేరుతో మెయిల్స్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బెదిరింపులు వచ్చిన హోటళ్లను పోలీసులు తనిఖీ చేశారు.

author-image
By V.J Reddy
New Update
BOMB THREAT

Tirupati Bomb : తిరుపతిలోని హోటల్స్ కు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ బాంబ్ బెదిరింపు ఈ-మెయిల్స్ ఆగడం లేదు. తాజాగా మూడోరోజు కూడా బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఉగ్రవాద సంస్థలు మెయిల్స్‌ పంపినట్లు పోలీసులు తెలిపారు. జాఫర్‌ సాదిక్‌ పేరుతో మెయిల్స్‌ వచ్చినట్లు చెప్పారు. బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చిన హోటల్స్ లో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అలాగే తిరుపతి కేటీ రోడ్డులోని ఆలయానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు సమాచారం.

Also Read :  పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా?

మూడు హోటళ్లకు...

గత రెండు రోజుల క్రితం తిరుపతిలోని పలు హోటళ్లకు వరుస బాంబ్ బెదిరింపులు వచ్చాయి. గురువారం లీలామహల్ సెంటర్‌లోని 3 హోటల్స్‌కు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఫేక్ బాంబు బెదిరింపుల రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే కపిల తీర్థం దగ్గర్లోని రాజ్‌పార్క్‌ హోటల్‌ను పేల్చేస్తామంటూ  మెయిల్ ద్వారా బెదిరింపులు  పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హోటల్లో తనికీ చేయగా ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. బాంబులు లేవని తేల్చడంతో  జనాలు ఊపిరి పీలుచుకున్నారు. ఇలా పలు సార్లు ఫేక్ బాంబు ఇలా  బెదిరింపులు రావడంతో..  దీని వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా తాజాగా మూడోసారి కూడా బాంబ్ బెదిరింపులు రావడంతో అక్కడి ప్రజలతో పాటు శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చిన భక్తుల్లో ఆందోళన నెలకొంది.

Also Read :  Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా

అయితే ఇటీవలే  తమిళనాడులో ఉగ్రవాది జాఫర్‌ సాదిక్‌ కు జైలు శిక్ష పడింది. ఆ శిక్ష పడేందుకు ప్రభుత్వం తరుఫున తమిళనాడు సీఎం స్టాలిన్‌ సహకారం అందించారు. సీఎం కుటుంబంతో పాటు తమిళనాడులోని కొన్ని స్కూళ్లలో పేలుళ్లకు ఐఎస్‌ఐ పూనుకొంది. అని మెయిల్‌ లో పేర్కొన్నారు. అందులో భాగంగా తిరుపతిలోని నాలుగు ప్రైవేట్‌ హోటళ్లను పేల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  కాజోల్ చనిపోయిందని వార్తలు!.. నటి కామెంట్స్ వైరల్

Also Read :   కోర్టుల్లో సాక్షులు ఎందుకు ప్రమాణం చేస్తారు?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment