Posani Bail: బిగ్ బ్రేకింగ్... పోసానికి బెయిల్

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది

New Update
Posani Krishna Murali.

Posani Krishna Murali

Posani Bail: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్ ను మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు..ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటికే పోసానికి  బెయిల్ వచ్చినా సీఐడీ పీటీ వారెంట్ తో జైలులోనే అరెస్ట్ చేసిన కోర్టు.. నెల రోజులుగా నటుడు పోసాని కృష్ణ మురళి నరసారావు జైల్లో రిమాండులో ఉన్నాడు. దీంతో తన ఆరోగ్య సమస్యల కారణాలని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. శుక్రవారం గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటీషన్ ని పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది. 

Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!

ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.  గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పోసాని బెయిల్‌ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. 

Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!

కోర్టు ఉత్తర్వుల మేరకు..

గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ ఫర్‌ ప్రొహిబిషన్‌/ఎక్సైజ్‌ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలిం­చారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది.  శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది. తన ఆరోగ్య సమస్యల కారణాలని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. శుక్రవారం గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటీషన్ ని పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది. 

Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్

 అయితే నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు గత నెల 27న అరెస్టు చేశారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజ అపార్ట్ మెంట్ లోని ఉంటున్న పోసానిని.. బుధవారం రాత్రి ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో  టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ లపై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణ, పశ్చిమగోదావరి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్

వైసీపీ నేత, కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు.రాములోరి కళ్యాణంలో ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మ మెడలో తాళి కట్టడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.

New Update
aluru

aluru

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తీరు వివాదాస్పమైంది. ఆదివారం దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ  వేడుకల్లో భాగంగా రామాలయాల్లో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించారు. ఈ క్రమంలోనే ఆలూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే విరూపాక్షి సొంతూరు చిప్పగిరిలో శనివారం రాములోరి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు  ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారు.

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

సాధారణంగా సీతారాముల కళ్యాణంలో భాగంగా అర్చకులు శ్రీరాములవారి తరుపున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని ఉంచుతారు. భక్తులకు మంగళసూత్రాన్ని చూపించిన తర్వాత.. ఆ రాములోరి తరుఫున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని పండితులు ఉంచుతారు. అయితే ఆలూరు ఎమ్మెల్యే మాత్రం తానే స్వయంగా సీతాదేవి మెడలో మంగళసూత్రాన్ని వేయడం వివాదాస్పదమవుతోంది.

Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావటంతో నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వారైనా ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించాల్సి ఉంది.

సీతమ్మ వారి మంగళసూత్రం తాకి ఇవ్వమని, ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు తాళి ఇచ్చారు. అయితే.. ఆ తాలిని కళ్ళకు అద్దుకోవాల్సింది పొగా... పొరపాటున సీతమ్మవారికి ఆ మంగళసూత్రాన్ని కట్టేశారు ఎమ్మెల్యే విరూపాక్షి.అయితే ఈ తథంగాన్ని అడ్డుకోకుండా పండితులు కూడా అక్షింతలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో... ఎమ్మెల్యే పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్షి క్షమాపణలు కూడా చెప్పారు . పండితులు కట్టమంటే... తాను సీతమ్మ మెడలో తాళిబొట్టు కట్టినట్లు తెలిపారు. 15 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నానని కూడా క్లారిటీ ఇచ్చారు విరూపాక్షి.

Also Read:Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు!

Also Read: Ap :ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్‌...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!

ycp-mla | kurnool | ap | aluru | mla virupakshi | sri-rama-navami | latest-news | telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment