Nandigam Suresh: నందిగం సురేష్ కు బెయిల్.. కోర్టు కండిషన్లు ఇవే!

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన గుంటూరు కోర్టు రూ.10 వేల చొప్పున 2 ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. మరియమ్మ కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్.. బెయిల్ రావడంతో ఐదు నెలల తర్వాత విడుదల కానున్నారు.

New Update
Nandigam Suresh Bail

Nandigam Suresh Bail

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గతేడాది సెప్టెంబర్‌లో సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మరియమ్మ మర్డర్ కేసులో అక్టోబరు 7న పీటీ వారెంట్‌పై మరోసారి అరెస్ట్ చేశారు. అయితే బెయిల్ కోసం నందిగం సురేష్ విశ్వ ప్రయత్నాలు చేశారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 7న డిస్మిస్ చేసింది.
ఇది కూడా చదవండి: YS Jagan: జగన్ కు బిగ్ షాక్.. ఎంపీ అయోధ్య సంచలన వ్యాఖ్యలు!

దీంతో గుంటూరు నాలుగో జిల్లా కోర్టులో సురేష్ తరఫున తానికొండ చిరంజీవి అనే లాయర్ బెయిల్ పిటిషన్ వేశారు.  ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల చొప్పున 2 ష్యూరిటీలను సమర్పించాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Chandra babu: ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. బీజేపీ సంచలన వ్యూహం

మరియమ్మ కేసు ఏంటి?

2020 డిసెంబర్‌లో తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య జరిగింది. ఆ సమయంలో రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో మరియమ్మ మృతి చెందారు. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. ఆ సమయంలో బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ను పోలీసులు 78వ నిందితుడిగా నమోదు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment