Kidnap in Tirupati: తిరుపతిలో దారుణం...ఒకే కుటుంబంలోని ఐదుగురు కిడ్నాప్...

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి లోని జీవకోన ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ కుటుంబ సభ్యులను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో రూ.కోటి ఇవ్వాలని వారిని బెదిరించారు. వారిలో ఒకరు దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు.

New Update
Kidnapping in Tirupati

Kidnapping in Tirupati

Kidnap in Tirupati: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి లోని జీవకోన ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ కుటుంబ సభ్యులను కొంతమంది దుండగులు నిన్న(శుక్రవారం) కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో రూ.కోటి ఇవ్వాలని వారిని బెదిరించారు. అయితే.. కుటుంబ సభ్యుల్లోని ఒకరు చిత్తూరులో ఉన్న తమ బంధువుల దగ్గరికి వెళితే ఇస్తామని చెప్పడంతో.వారిని దుండగులు తీసుకెళ్తుండగా ఐతేపల్లి వద్ద కారులో నుంచి రాజేష్ దూకేశాడు.

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన సీఐడీ
 
అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రాజేష్‌ను స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు రాజేష్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ తన భార్య, పిల్లలను కాపాడాలని పోలీసులను వేడుకున్నారు. ఈ తరుణంలో అతని కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ

Also Read: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 8 మంది పాక్ ఆర్మీ సైనికులు మృతి

రాజేష్ పై పగబట్టిన భార్గవ్

తిరుపతి జీవకోనకు చెందిన రాజేష్ తన స్నేహితుడు భార్గవ్ కి గతంలో షూరిటీ గా ఉండి  డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది.  తన పరిస్థితి బాగాలేదని తిరిగి డబ్బులు ఇవ్వాలంటూ కోరిన రాజేష్ పై పగబట్టిన భార్గవ్. చెల్లించాల్సిన సొమ్ము కాస్త పక్కన పెట్టి రెండు కోట్లు ఇస్తే నీ కుటుంబాన్ని వదులుతా లేకుంటే చంపేస్తానంటూ బెదిరించి కిడ్నాప్ చేసిన భార్గవ్. కిడ్నాపర్ల వలలో నుంచి ప్రాణాలతో బయటపడ్డ రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

Also Read: మరో మయన్మార్‌ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో!

ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.

New Update
ACCIDENT

AP Kakinada road accident one man died

Accident: ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు. ఈ మేరకు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొలెరో డ్రైవర్ మద్యం సేవించినట్లు అనుమానిస్తు్న్నారు. శివ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా మృతిడి పేరెంట్స్, బంధువులు శోకచంద్రంలో మునిగితేలారు. 

ప్రేమోన్మాది కత్తితో దాడి..

ఇదిలా ఉంటే.. విశాఖలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇది కూడా చదవండి: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

 kakinada | died | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment