Tirumala: తిరుపతి వెళ్తున్నారా? ఇక మీదట ఇలా చేయడం తప్పనిసరి..

తిరుమల తిరుపతి దేశస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  వారంతం కావడంతో భక్తులు దైవదర్శనానికి పోటెత్తారు. మరోవైపు వేసవి సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందనే కారణమే కాకుండా ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు.

New Update

Tirumala: తిరుమల తిరుపతి దేశస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  త్వరలో పదవ తరగతి పరీక్షలు జరగనుండటం, వారంతం కావడంతో భక్తులు దైవదర్శనానికి పోటెత్తారు. మరోవైపు వేసవి సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందనే కారణమే కాకుండా ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. శుక్రవారం నాడు 67,127 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే, శనివారం నాడు సుమారు 69,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,910 మంది తలనీలాలు సమర్పించారు.  ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో తొమ్మిది కంపార్ట్‌మెంటల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!


కాగా తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తుల కోసం - టీటీడీ అధికారులు త్వరలో ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వివిధ రకాల ఆర్జిత సేవలు సహా అన్ని రకాల టికెట్లు/టోకెన్ల జారీ, తిరుపతి, తిరుమలల్లో ఉండే వసతి భవన సముదాయాల్లో గదుల బుకింగ్‌లో ఈకేవైసీ, ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థ అమలులోకి రానుంది. టికెట్ల బుకింగ్‌లో దళారుల జోక్యాన్ని నివారించడానికి టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈకేవైసీ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అవసరమైన గెజిట్ నోటిఫికేషన్‌ను రెవెన్యూ (దేవాదాయం) శాఖ కార్యదర్శి వినయ్ చంద్ జారీ చేశారు. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ విధానాన్ని అమలు చేయాలంటూ టీటీడీ కొత్త పాలక మండలి తన తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందే- ఆధార్ అథెంటికేషన్‌కు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ కార్యనిర్వహణాధికారి.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.

Also Read: Karnataka: నటి రన్యారావు కేసులో కీలక మలుపు..సీబీఐ కేసు

ఇప్పుడు తాజాగా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ ఈకేవైసీ  విధానానికి అనుమతులను ఇచ్చింది. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ అమలు విధానం కేంద్రం పరిధిలో ఉన్నందున ఈ అనుమతులను తీసుకోవడం తప్పనిసరి అయిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ అమలు వల్ల టికెట్ల బుకింగ్‌‌లో మరింత పారదర్శకత ఏర్పడుతుందని, టికెట్/టోకెన్ తీసుకున్న వాళ్లకు బదులుగా వేరొకరు దర్శనాలకు రావడం, వాళ్ల పేర్ల మీద గదులను బుక్ చేయడం వంటి లోపాలను సరిచేయవచ్చని అంటున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు స్వయంగా టోకెన్లు/టికెట్లను తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోన్నారు. దీనివల్ల దళారుల బెడదతను నివారించడంతో పాటు పారదర్శకత సాధ్యమైతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: Peanuts Peel: పల్లీల పొట్టుతో కూడా పుట్టెడు లాభాలు.. ఏంటంటే?

Also Read: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ బలహీనపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది

New Update
Rains

Rains

Ap Rains: నైరుతి,  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అక్కడే కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. 'ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా, ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా వచ్చి  24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడుతుంది. బుధవారం, గురువారం అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, చెట్లు క్రింద నిలబడరాదు' అని సూచించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని.. కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

Also Read: Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

'అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వేడిగాలులు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బుధవారం నాడు 25 మండలాల్లో వేడగాలులు వీస్తాయి. మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ కడప జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా కామవరం 40.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6 డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి' అని  కూర్మనాథ్ తెలిపారు.

మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. రానున్న మూడు రోజుల వ్యవధిలో నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవాళ పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Also Read:Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

Also Read: Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్.

ap-weather | AP Weather Alert | AP Weather Latest Update | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today | latest-news | telugu-news | latest telugu news updates | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు