Andhra Pradesh: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు!

రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్‌ క్యాలెండర్‌ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది.

New Update
ap stu

Andhra Pradesh: రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు  చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్‌ క్యాలెండర్‌ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది. ఉన్నత పాఠశాలల పని వేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కాగా దీన్ని 5 గంటల  వరకు పెంచింది.

మండలానికి రెండు పాఠశాలల్లో..

ప్రయోగాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు పాఠశాలల్లో ఈ విధానం అమలుకు ఆదేశాలిచ్చింది. ఎంపిక చేసిన స్కూళ్లలో నవంబర్‌ 25 నుంచి 30 వరకు ఈ విధానంలో పాఠశాలలు నడపనున్నారు. కేవలం సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని, మిగతా వెయిటేజీలో మార్పులు ఉండవని అధికారులు ప్రకటించారు.

Also Read: సునీతా విలియమ్స్‌ ఆరోగ్యంపై ఆందోళనలు.. స్పందించిన ఆస్ట్రోనాట్

ఈ ప్రయోగం అనంతరం ఈ నెల 30న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ కి అభిప్రాయాలు నివేదించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇక్కడి ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లో అమలు చేయనున్నారు.

Also Read: Manipur: రగులుతున్న మణిపూర్...కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమీక్ష

ఉన్నత పాఠశాలల పని వేళల మార్పు నిర్ణయం పై పునరాలోచించాలని  ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్‌, రాధాకృష్ణ , సీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు జమాల్‌ రెడ్డి, ఏసీవీ గురువా రెడ్డిలు ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో కోరారు. 

Also Read: డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదాని.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

5 కి.మీ పరిధి దూరం నుంచి వచ్చే విద్యార్థులుయ కొందరు ఉంటారు. వారంతా  సాయంత్రం ఐదింటి వరకు బడిలో ఉంటే ఆ తరువాత ఇళ్లకు చేరేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు అంటున్నారు. వాతావరణం, ఇంటి సమస్యల దృష్ట్యా పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

Also Read: Delhi: ఢిల్లీలో స్టేజ్ –4 ఆంక్షలు..మొత్తం అన్ని స్కూళ్ళు క్లోజ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert:  ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?

వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.

New Update
  Rain Alert For Telangana

Rain Alert

Rain Alert : వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే , మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కు మార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
 
ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో  భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
 
అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల22 నుంచి27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

 

 

Advertisment
Advertisment
Advertisment