Paritala Ravi: 18ఏళ్ళ తర్వాత..పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్

పరిటాల రవి హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఈ కేసులోని ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. పరిటాల హత్య కేసులోని నారాయణరెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

New Update
ravi

టీడీపీ నేత , మాజీ మంత్రి పరిటాల రవి హత్యకేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి బెయిల్ వచ్చింది. పరిటాల రవి హత్య కేసు నిందితులకు ఏపీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పరిటాల రవి హత్య కేసులో ఏ3గా ఉన్న పండుగ నారాయణరెడ్డి, ఏ4 రేఖమయ్య, ఏ5 బజన రంగనాయకులు, ఏ6 వడ్డే కొండ, ఏ8 ఓబిరెడ్డికి బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read: Ap Crime: ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!

ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. అలాగే నిందితులు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ఉత్తర్వుల్లో వివరించింది. సోమవారం ఉదయం 11 గంటలకల్లా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎదుట హాజరు అవ్వాలని చెప్పింది. చట్టానికి లోబడి వ్యవహరించాలని.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే బెయిల్ రద్దు చేస్తామని ఏపీ హైకోర్టు హెచ్చరించింది.

Also Read: KTR: కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. రంగంలోకి స్పెషల్ టీమ్!

AP High Court - Paritala Ravi

2005లో జరిగిన పరిటాల రవి హత్య అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఈ ఐదుగురికి కింది కోర్టు శిక్ష విధించింది. వీరంతా కూడా గత 18 ఏళ్లుగా జైళ్లోనే ఉన్నారు. అయితే కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు. అలాగే బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. 

Also Read: Jaipur: పెట్రోల్‌ బంక్‌ లో భారీ అగ్ని ప్రమాదం..ఐదుగురి మృతి!

ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పరిటాల రవి హత్య కేసులో మొద్దు శీను అనే రౌడీ షూటర్ అరెస్ట్ అయ్యాడు. తన బావ సూరి కళ్లలో ఆనందం చూడటం కోసమే పరిటాల రవిని కాల్చానంటూ అప్పట్లో మొద్దు శీను మీడియా ముఖంగా ప్రకటించి సంచలనాలకు తెరలేపాడు.

Also Read: Supreme Court: చట్టాలున్నది మొగుళ్లను బెదిరించడానికి కాదు

పరిటాల హత్యక కేసులో అరెస్టైన మొద్దు శీను అలియాస్ జూలకంటి శ్రీనివాస్ రెడ్డిని 2008లో మల్లెల ఓం ప్రకాశ్ అనే ఖైదీ జైల్లో హత్య చేశారు. మొద్దు శీను నిద్రపోతున్న సమయంలో తలపై డంబెల్‌తో మోది హత్య చేశాడు. ఆ తర్వాత ఓం ప్రకాశ్ కూడా 2020లో అనారోగ్యంతో మరణించాడు.

 ఇక పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి సైతం హత్యకు గురయ్యారు. భానుకిరణ్ అనే వ్యక్తి సూరిని వెనుక నుంచి కాల్చి చంపాడు. అనంతరం భానుకిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.దాంతో అతనికి శిక్ష పడింది.

నెలరోజుల క్రిందట మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ కూడా జైలు నుంచి బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment