AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ప్రభుత్వం నుంచి మహిళలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారని మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో కొనియాడారు. 

New Update
AP: మదనపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..!

AP CM Chandrababu praises on womens

AP News: మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం నుంచి మహిళలకు మరింత ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారని మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో కొనియాడారు. 

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి..

ఈ మేరకు మార్చి8న మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో శుక్రవారం ‘న్యూ జెనరేషన్-టెక్కేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్‌ప్రైజెస్ - ప్రోస్పెరిటీ ఫర్ ఆల్’ అనే అంశంపై సదస్సు నిర్వహిచారు. నోవోటెల్ హోటల్ జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో మహిళా పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచడం, సాంకేతికత వినియోగం, నూతన ఆవిష్కరణల ద్వారా ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని అన్నారు.  మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ఇందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తుందని చెప్పారు. 

పురుషులకంటే మహిళలే మెరుగు..

అంతేకాదు ప్రస్తుత రోజుల్లో పురుషులకంటే మహిళలే మెరుగ్గా రాణిస్తున్నారని కొనియాడారు. అన్ని రంగాల్లో అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. శ్రామిక శక్తిలో మహిళలు లేకుండా పురోగతి అసాధ్యం. ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. నా చిన్నతనంలో నా తల్లి వంటగదిలో పడ్డ ఇబ్బందులు నేను చూశాను. నా తల్లి పడిన కష్టం ఏ మహిళా పడకూడదనే ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకొచ్చాం. నా తల్లి కష్టం ఈ పథకాన్ని తీసుకురావడానికి ప్రేరణగా నిలిచిందన్నారు. ప్రస్తుతం దీపం 2 కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలపై భారాన్ని మరింత తగ్గించాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను దాదాపు 45 శాతం మహిళలే నడిపిస్తున్నారని చెప్పారు. బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు అందించి స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడంతో మహిళలకు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తారన్నారు.  అందుకోసం అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 


ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

ఇక రాష్ట్రంలో వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఏ మహిళకైనా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నిర్మాణాత్మకమైన మద్దతును అందిస్తామని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మహిళలను ప్రోత్సహించి అద్భుతాలను సృష్టిస్తామన్నారు. ప్రతి మహిళ AIలోనూ రాణించాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం 2.4 ట్రిలియన్ డ్రాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ ఆవిష్కరించాలనే లక్ష్యంతో విజన్‌ను రూపొందించామన్నారు. ఏపీని ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ గా నిలిపి 15 శాతం వృద్ధి రేటు సాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen-KA Paul: ట్రంప్ కు చెప్పా.. తర్వాత చచ్చే ఆ 100 మంది వీళ్లే.. కేఏ పాల్ సంచలన ప్రెస్ మీట్!

పాస్టర్ ప్రవీణ్ మృతి విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకుని వెళ్లానని KA పాల్ తెలిపారు. న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానన్నారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు.

New Update

పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ గాంధీనగర్ లో ఈ రోజు మీడియాతో పాల్ మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్‌ ది హత్య అనే చెప్పేందుకు తన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. ఇదే విషయాన్ని హై కోర్టులో కూడా తాను చెప్పానన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును ఛేదించడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. 24 సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు. చనిపోయి 22 రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!

ఎస్పీతో చంద్రబాబు ఎందుకు మాట్లాడారు..?

ఈ దుర్మార్గులు ప్రవీణ్ ను తాగుబోతుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు విడుదల చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎందుకు క్లోజ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనకు ముందు ప్రవీణ్ కు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు. బెదిరింపుల గురించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ తో సీఎం చంద్రబాబు 45 నిమిషాలు ఎందుకు మాట్లాడారు..? అని అనుమానం వ్యక్తం చేశారు. 
ఇది కూడా చదవండి: Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!

రాష్ట్రంలో చర్చిలు ఎన్ని ఉన్నాయో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆరా తీశారు..? అని ఫైర్ అయ్యారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ఈ విషయాన్ని ట్రాంప్ దృష్టికి తీసుకుని వెళ్లానన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానని ప్రకటించారు. ప్రవీణ్ మద్యం తాగి ఉంటే విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 

(Pastor Praveen | telugu-news | telugu-latest-news )

Advertisment
Advertisment
Advertisment