Ap: ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను పెంచే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నవిషయం తెలిసిందే. కానీ ఈ మార్జిన్ అస్తవ్యస్తంగా ఉంది, దీనిని పెంచాలని దుకాణ యజమానులు ఎప్పటి నుంచో కోరుతున్న క్రమంలో ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను పరిశీలించి, తెలంగాణలో ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా 14 శాతం మార్జిన్ ఇవ్వాలని భావిస్తుంది. Also Read: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి! ఏపీ సీఎం ఈ నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కూడా నిర్ణయించారు. మద్యం షాపుల్లో గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.ఈ నిర్ణయానికి సంబంధించి, వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Also Read: Baba Vanga: 2025లో 3వ ప్రపంచ యుద్ధం.. బాబావంగా జోష్యం వైరల్! రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులలో 340 షాపులు గీత కులాలకుఇవ్వనున్నారు. ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, గౌడ, శెట్టి బలిజ, యాత, సోదీ వంటి కులాల వారికి ఈ షాపులు కేటాయిస్తారు. షాపుల కేటాయింపు ఆయా కులాల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి ఒక్కొక్క షాపు కోసం ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ఒక వ్యక్తికి ఒక్క షాపే కేటాయిస్తారు. ఈ షాపులు 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటాయని తెలిపారు. Also Read: Vaibhav: అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. అద్భుత ఇన్నింగ్స్పై ప్రశంసలు! మరోవైపు, రూ. 99కి మద్యం అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై కూడా చర్చకు వచ్చింది. మద్యం అమ్మకాలు ప్రతీ సంవత్సరం పెరుగుతున్నా, తక్కువ రేట్లలో మద్యం విక్రయించడం వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం లభించడం లేదని అధికారులు చెప్పుకొచ్చారు. అయినా, మద్యం అన్ని చోట్లా తక్కువ రేట్లలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. Also Read: Happy New Year: కొత్త సంవత్సరం వచ్చేసింది...వెల్కమ్ టూ 2025 బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, మద్యం తయారీ, సరఫరా, సేల్స్ను టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నిబంధనల ఉల్లంఘన వంటి చర్యలను నివారించాలన్నారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర , ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు.