మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. కేవలం రూ.2 లక్షలకే..

డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వనుంది. కేవలం రూ.2 లక్షలు చెల్లిస్తే శిక్షణ పొందిన వారికి డ్రోన్‌ను అందజేస్తారు. ఈ శిక్షణ ఇవ్వడం వల్ల మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు సాగులో సాంకేతికతను పెంచవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
chandrababu

ఏపీలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. డ్వాక్రా సంఘాలకు డ్రోన్ పైలట్‌లో శిక్షణ ఇవ్వనుంది. ఇందులో శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ శిక్షణలో భాగంగా గ్రామంలో కొందరు మహిళలను ఎంపిక చేసి అందులో డ్రోన్ పైలట్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం రెండు లక్షలకే శిక్షణ తీసుకున్న వారికి డ్రోన్‌ను ఇవ్వనున్నారు. దీనివల్ల మహిళలకు ఆర్థికంగా చేయూతగా ఉండటంతో పాటు సాగులో సాంకేతికత ఉంటుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో..

ఈ శిక్షణ వల్ల సాగు విషయంలో సాంకేతికత పెరుగుతుంది. అలాగే వ్యవసాయ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కూలీలు, ఖర్చులు తగ్గించుకుందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు పొలంలో ఎరువులు పిచికారీ చేయాలంటే కూలీలు దొరకడం కష్టం. దీనివల్ల కొన్ని రోజుల సమయం పట్టడంతో పాటు డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. అదే డ్రోన్ ఉంటే ఈజీగా ఒక్క రోజులో పని పూర్తవుతుంది. ఈ డ్రోన్లను గ్రామంలో అన్ని వ్యవసాయ పనులకు వినియోగించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఇది కూడా చూడండి:  తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!

ఈ డ్రోన్ల బాధ్యతను కూడా డ్వాక్రా మహిళలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించుకోంది. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనుంది.గ్రామాల్లో ఎంపిక చేసిన మహిళలకు ఒక 15 రోజుల పాటు డ్రోన్లపై శిక్షణ ఇవ్వనున్నారు. కుటుంబంలో ఒకరికి రిమోట్ పైలట్‌గా శిక్షణ ఇస్తే మిగతా వారికి ఫిటింగ్, మెకానికల్, రిపైర్ వంటి వాటిపై శిక్షణ ఇవ్వనున్నారు.

ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

శిక్షణ ఇచ్చిన తర్వాత వీరికి సర్టిఫికేట్లు కూడా ఇస్తారు. గ్రామాల్లో ఉండే మహిళలు నేర్చుకోవడం వల్ల వ్యవసాయ రంగంలో బాగా సాయపడుతుంది. ఈ డ్రోన్లలో శిక్షణ పొందిన మహిళకు రూ.10 లక్షల విలువ చేసే వాటిని అందిస్తారు. ఇంత ఖరీదు డ్రోన్లలను 80 శాతం రాయితీతో లబ్ధిదారులకు కేవలం రూ.2 లక్షలకే ఇస్తారు. మిగతా రూ.8 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. 

ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!

ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ప్యాకింగ్‌తో సిద్ధం చేశారు.మొత్తం 70వేల లడ్డూలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

New Update
Tirupati Laddu

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ కళ్యాణానికి వచ్చే భ‌క్తుల‌కు టీటీడీ తీపికబురు చెప్పింది. శుక్రవారం జరిగే కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రెడీ అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్‌, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది తిరుమలలో శ్రీ‌వారి సేవ‌కులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. 

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

 ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామ స్వామి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30  మధ్య  జరిగే  శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ఉచిత ప్రసాదంగా అందజేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటిమిట్ట లో ఈ నెల 11వ తేదీన జరుగనున్న రాముల వారి కల్యాణం ఏర్పాట్లను టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మంతో కలసి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. 

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

ఈ సందర్భంగా శుక్రవారం శ్రీకోదండరామ స్వామి కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నసందర్భంగా, ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహాం వద్ద ముఖ్యమంత్రి బస చేసే గదులలో ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ కోతలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలలో పచ్చదనం, పుష్పాలంకరణలు తాజా పుష్పాలతో ఏర్పాటు చేయాలన్నారు.

అటు తర్వాత టీటీడీ అతిథి గృహం నుంచి ఆలయం వరకు పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయంలోపుల ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో నిల్వ వున్న సామాగ్రి, వస్తువులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయం అంతా కలియ తిరిగారు. ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు విద్యుత్ కాంతులు, పుష్పలంకరణలలో రాజీ లేకుండా నాణ్యంగా పనులు చేపట్టాలని కోరారు. 

అధికారులు సమన్వయంతో జిల్లా యంత్రాంగం, టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులు అందరికి అన్నప్రసాదాలు, స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, త్రాగునీరు, మజ్జిక పంపిణీ చేస్తామని చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్లు జిల్లా రెవిన్యూ, పోలీసు, స్థానిక పంచాయతీ, టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. 

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Also Read: Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!

kadapa | sita rama kalyanam at vontimitta | vontimitta kalyanam | vontimitta-kodandaram | vontimitta ramalayam | vontimitta sitarama kalyanam | vontimitta sita rama kalyanam | ttd | laddu

Advertisment
Advertisment
Advertisment