తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు!

తిరుమల టికెట్లు అమ్ముకున్న డబ్బులతో రోజా బెంజ్ కారు కొనుక్కుందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శనానికి వెళ్లిన ప్రతీ సారి వందల మందిని వెంట తీసుకెళ్లిందన్నారు. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి చంద్రబాబు తప్పు చేశాడన్నారు.

New Update
JC Prabhakar Reddy Roja

JC Prabhakar Reddy Roja

తిరుమల టికెట్లు అమ్ముకుని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా బెంజ్ కారు కొన్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టోకెన్లు అమ్ముకుని బెంజ్ కార్లు కొనుక్కుందని ఫైర్ అయ్యారు. పోయిన ప్రతీ సారి వందల మందిని దర్శనానికి తీసుకుందన్నారు. ఆమె మీద చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని.. కథ చెప్పాలంటే చాలా ఉందన్నారు. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి చంద్రబాబు తప్పు చేశాడన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయికి చేరుకున్నావా? అంటూ ఫైర్ అయ్యారు. 
ఇది కూడా చదవండి: AP Weather Updates: పండుగ పూట ఏపీకి షాకింగ్ న్యూస్.. భారీ వర్షాలు!

తప్పంతా చంద్రబాబుదే..

తాము వైసీపీ హయాంలో అనేక కష్టాలు పడ్డామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వాటన్నింటినీ వదిలేశాడన్నారు. తప్పంతా చంద్రబాబుదేనన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని రోజాకు సూచించారు జేసీ. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఫేడ్ అవుట్ అవుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. 
ఇది కూడా చదవండి: ఛీ.. ఛీ.. ఏం మనిషివిరా.. తిరుమలలో బ్యాంకు ఉద్యోగి ఏం చేశాడంటే!

జగన్ కు సొంత పార్టీలోనే శత్రువులు..

జగన్ కు ఆయన సొంత పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లోనే శత్రువులు ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. తిరుపతిలో దురుదృష్టవశాత్తు జరిగిన తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన బోటు ప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. అయినా ఆ బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించలేదన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యియి. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

మే1 నుంచి రద్దు

ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

ఒక్కరోజే 82,811 మంది భక్తులు

ఇదిలా ఉంటే TTDలో టోకెన్లు లేని భక్తులకు దాదాపు 18 గంటల సమయం పైనే పడుతోంది. కేవలం ఒక్క శనివారం రోజే భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సుమారు 82,811 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కేవలం ఆ ఒక్క రోజే రూ.3.24 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment