BIG BREAKING: మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో ఆయన కూడా అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

New Update
YCP Abbayya Chowdary

YCP Abbayya Chowdary

దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఎమ్మెల్యే కారును అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం తదితర అభియోగాల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి ఓ మ్యారేజ్ ఫంక్లన్లో జరిగిన వివాదం ఈ కేసుకు దారితీసినట్లు తెలుస్తోంది. దెందులూరులో జరిగిన వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి వాహనాన్ని ఎమ్మెల్యే చింతమనేని వాహనానికి అడ్డుపెట్టినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మూడ్ ఆఫ్ ది నేషన్ : బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో చంద్రబాబు

దెందులూరులో వేడెక్కిన వాతావరణం..

అబ్బయ్య చౌదరి కావాలని గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అవుతున్నారు. అయితే.. అబ్బయ్య మాత్రం తన కుటుంబాన్ని అంతమొందించే కుట్ర సాగుతోందని మండిపడుతున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతుండడంతో దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. 
ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీతోపాటు మరో ఇద్దరు అరెస్ట్.. A1గా వంశీ

ఏపీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై వరుసగా కేసులు నమోదు కావడంతో ఆ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎవరు అవుతారోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తం అవుతోంది. నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్ట్ ఉంటుందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!

ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ప్యాకింగ్‌తో సిద్ధం చేశారు.మొత్తం 70వేల లడ్డూలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

New Update
Tirupati Laddu

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ కళ్యాణానికి వచ్చే భ‌క్తుల‌కు టీటీడీ తీపికబురు చెప్పింది. శుక్రవారం జరిగే కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రెడీ అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్‌, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది తిరుమలలో శ్రీ‌వారి సేవ‌కులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. 

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

 ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామ స్వామి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30  మధ్య  జరిగే  శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ఉచిత ప్రసాదంగా అందజేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటిమిట్ట లో ఈ నెల 11వ తేదీన జరుగనున్న రాముల వారి కల్యాణం ఏర్పాట్లను టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మంతో కలసి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. 

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

ఈ సందర్భంగా శుక్రవారం శ్రీకోదండరామ స్వామి కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నసందర్భంగా, ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహాం వద్ద ముఖ్యమంత్రి బస చేసే గదులలో ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ కోతలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలలో పచ్చదనం, పుష్పాలంకరణలు తాజా పుష్పాలతో ఏర్పాటు చేయాలన్నారు.

అటు తర్వాత టీటీడీ అతిథి గృహం నుంచి ఆలయం వరకు పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయంలోపుల ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో నిల్వ వున్న సామాగ్రి, వస్తువులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయం అంతా కలియ తిరిగారు. ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు విద్యుత్ కాంతులు, పుష్పలంకరణలలో రాజీ లేకుండా నాణ్యంగా పనులు చేపట్టాలని కోరారు. 

అధికారులు సమన్వయంతో జిల్లా యంత్రాంగం, టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులు అందరికి అన్నప్రసాదాలు, స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, త్రాగునీరు, మజ్జిక పంపిణీ చేస్తామని చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్లు జిల్లా రెవిన్యూ, పోలీసు, స్థానిక పంచాయతీ, టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. 

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Also Read: Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!

kadapa | sita rama kalyanam at vontimitta | vontimitta kalyanam | vontimitta-kodandaram | vontimitta ramalayam | vontimitta sitarama kalyanam | vontimitta sita rama kalyanam | ttd | laddu

Advertisment
Advertisment
Advertisment