Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. అనితపై 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు రాజీ కుదుర్చుకున్నారు.

New Update
minister Anitha

Ap Home Minister: ఏపీ హోం మినిస్టర్‌ వంగలపూడి అనితకు హైకోర్టులో బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. ఆమె పై విశాఖ ఏడో ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టులో దాఖలుచేసిన చెక్ బౌన్స్‌ కేసును హైకోర్టు కొట్టేసింది. మంగళవారం విచారణ జరగ్గా.. హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు అంటెడ్‌ అయ్యారు. ఇద్దరితో న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్‌ మాట్లాడారు. ఈ కేసును రాజీ ద్వారా పరిష్కరించుకుంటున్నారా.. కింద కోర్టులో కేసును కొట్టేయొచ్చా అంటూ వారిని ప్రశ్నించారు. 

Also Read: Ap Rains: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్‌..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఈ కేసును తాము రాజీ చేసుకున్నామని హైకోర్టుకు తెలిపారు. హైకోర్టులో విచారణ సమయంలో హోంమంత్రి తరఫు లాయర్ రాజీ అంశాలను ప్రకటించారు. ఓ మెమోను దాఖలు చేశామని తెలిపారు. ఇప్పటికే రూ.10 లక్షలు శ్రీనివాసరావుకు అందజేశామని.. మరో రూ.5 లక్షలను చెక్కు రూపంలో శ్రీనివాసరావు తరఫు లాయర్‌కు హైకోర్టులో అందజేశారు. మొత్తానికి ఈ కేసు కొట్టివేయడంతో హోమంత్రి అనితకు భారీ ఊరట లభించినట్లయ్యింది. ఎప్పటి నుంచో ఇబ్బందిగా మారిన ఆ కేసు నుంచి విముక్తి  లభిస్తుంది.

Also Read: Ap: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌...క్రిస్మస్‌,సంక్రాంతి కానుకలు!

2015లో అనిత తన దగ్గర నుంచి తీసుకున్న రూ.70లక్షల అప్పు చెల్లించేందుకు.. 2018లో అనిత చెక్కు ఇచ్చారని, అది చెల్లలేదని వేగి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన 2019లో విశాఖపట్నం ఏడో ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టులో చెక్ బౌన్స్ అంశంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో తమ మధ్య రాజీ కుదిరిందని పిటిషన్‌దారు చెప్పారు. విశాఖ కోర్టులో కేసును కొట్టేయాలని హోంమంత్రి అనిత హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. ఈ మేరకు తాజాగా తీర్పును ప్రకటించారు.

Also Read: 11 లక్షల 70 వేలమంది బడి మానేశారు..ఎక్కువగా ఎక్కడ అంటే?

ఈ పిటిషన్‌పై ఈనెల 3న కూడా విచారణ అయ్యింది. అయితే హైకోర్టు ఇరువురు ఏ విధంగా రాజీ కుదుర్చుకున్నారో చెప్పకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. అనితపై తప్పుడు కేసు పెట్టారంటూ అభియోగాలు రాగా.. తాను తప్పుడు కేసు పెట్టలేదని శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. తాను డబ్బుల కోసం తిరగలేకే రాజీ చేసుకున్నట్లు ఆయన వివరించారు. 

Also Read: ఇజ్రాయెల్‌ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు

ఈ మేరకు హోంమంత్రి అనిత తరఫు లాయర్ రాజీ విషయాన్ని కోర్టుకు చెప్పారు. అయితే రాజీకి సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు చెప్పింది. దీంతో మంగళవారం విచారణ జరగ్గా.. విశాఖ కోర్టులోని కేసును కొట్టి వేస్తున్నట్లు తీర్పునిచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!

ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ప్యాకింగ్‌తో సిద్ధం చేశారు.మొత్తం 70వేల లడ్డూలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

New Update
Tirupati Laddu

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ కళ్యాణానికి వచ్చే భ‌క్తుల‌కు టీటీడీ తీపికబురు చెప్పింది. శుక్రవారం జరిగే కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రెడీ అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్‌, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది తిరుమలలో శ్రీ‌వారి సేవ‌కులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. 

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

 ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామ స్వామి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30  మధ్య  జరిగే  శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ఉచిత ప్రసాదంగా అందజేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటిమిట్ట లో ఈ నెల 11వ తేదీన జరుగనున్న రాముల వారి కల్యాణం ఏర్పాట్లను టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మంతో కలసి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. 

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

ఈ సందర్భంగా శుక్రవారం శ్రీకోదండరామ స్వామి కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నసందర్భంగా, ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహాం వద్ద ముఖ్యమంత్రి బస చేసే గదులలో ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ కోతలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలలో పచ్చదనం, పుష్పాలంకరణలు తాజా పుష్పాలతో ఏర్పాటు చేయాలన్నారు.

అటు తర్వాత టీటీడీ అతిథి గృహం నుంచి ఆలయం వరకు పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయంలోపుల ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో నిల్వ వున్న సామాగ్రి, వస్తువులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయం అంతా కలియ తిరిగారు. ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు విద్యుత్ కాంతులు, పుష్పలంకరణలలో రాజీ లేకుండా నాణ్యంగా పనులు చేపట్టాలని కోరారు. 

అధికారులు సమన్వయంతో జిల్లా యంత్రాంగం, టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులు అందరికి అన్నప్రసాదాలు, స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, త్రాగునీరు, మజ్జిక పంపిణీ చేస్తామని చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్లు జిల్లా రెవిన్యూ, పోలీసు, స్థానిక పంచాయతీ, టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. 

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Also Read: Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!

kadapa | sita rama kalyanam at vontimitta | vontimitta kalyanam | vontimitta-kodandaram | vontimitta ramalayam | vontimitta sitarama kalyanam | vontimitta sita rama kalyanam | ttd | laddu

Advertisment
Advertisment
Advertisment