AP: టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్‌..పరీక్షా విధానంలో మార్పులు!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్ సిలబస్‌ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.

New Update
ap

Ap Tenth Exams: ఏపీలో పదో తరగతికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులకు రెడీ అవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్ సిలబస్‌ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు అవసరమైన కసరత్తులు మొదలు పెట్టారు. 

Also Read: మేము చనిపోతాం.. అనుమతివ్వండి

అన్ని స్కూళ్లకు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌నే...

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌లోని అన్ని స్కూళ్లకు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌నే అమలు చేస్తున్నారు. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ చదువుతూనే విద్యార్థులు రాష్ట్ర బోర్డు పరీక్షలు రాస్తున్నారు. అయితే సీబీఎస్‌ఈలో ఇంటర్నల్ మార్కుల విధానం ఉంది. గతంలో సీసీఈ విధానంలో ఇంటర్నల్ మార్కులు ఉండగా.. 2019లో వీటిని రద్దు చేశారు.

Also Read: ఆంధ్ర ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లో తిరగనివ్వం..!

ఇంటర్నల్ మార్కుల విషయంలో ప్రభుత్వ స్కూళ్లు నిబంధనలు పాటిస్తున్నా.. ప్రైవేటు స్కూళ్లు ఇష్టవచ్చినట్లుగా మార్కులు వేసుకుంటున్నాయని ఫిర్యాదులు అందడంతో  ఆ విధానాన్ని రద్దు చేశారు.

Also Read:  మళ్ళీ పని మొదలు పెట్టిన హైడ్రా బుల్డోజర్లు.ఈ సారి ఎక్కడో తెలుసా?

ఇప్పుడు 2025-26 విద్యాసంవత్సరం నుంచి పదిలో రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ 20 మార్కులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే స్కూళ్లలో ఇష్టం వచ్చినట్లుగా మార్కులు వేసుకోకుండా పకడ్బందీ విధానాన్ని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.సీబీఎస్‌ఈలో ఇంటర్నల్ మార్కులు 20కి 20 వేసుకోకుండా ప్రత్యేకంగా ఓ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Also Read: ద్వారకా తిరుమలలోనే మకాం వేసిన చిరుత!

ఇప్పుడు అలాంటి విధానాన్నే రాష్ట్రంలో కూడా తీసుకురావాలని భావిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షల్లో సూక్ష్మ, లఘు ప్రశ్నలు 12 ఉంటాయి. వీటికి ఒక్కో దానికి అరమార్కు, తేలికైన 8 ప్రశ్నలకు ఒక్కో మార్కు ఉండగా.. వీటిని ఒక్కో మార్కు ప్రశ్నలుగా మార్పు చేయాలనే అంశం పై అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తానికి పదో తరగతికి సంబంధించి ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment