ఏపీ ప్రజలకు షాక్.. మరోసారి పెరగనున్న విద్యుత్ ఛార్జీలు

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్‌ ఛార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా విద్యుత్ ధరలు పెంచడం రెండోసారి. డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ తాజాగా ఆమోదం తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
CURRENTT

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్‌ ఛార్జీలు(AP Electricity Charges) పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా విద్యుత్ ధరలు పెంచడం రెండోసారి. డిస్కంల ప్రతిపాదనలకు  విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ నెల నుంచి వినియోగదారుల పైన రూ.9,412 కోట్ల వరకు భారం పడనుంది. సర్దుబాటు ఛార్జీలను యూనిట్‌కు 92 పైసలు చొప్పున 2026 నవంబర్ వరకూ వసూలు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది.    

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజు 3 లక్షల మందికి రుణమాఫీ !

ఇదిలాఉండగా ఇప్పటికే ట్రూ అప్‌తో పాటు రెండు ఫ్యూయల్ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్‌ (FPPCA) ఛార్జీలు పెంచిన విద్యుత్ సంస్థలు మరోసారి భారం మోపడం చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.12,844 కోట్లు సర్దుబాటు చేసేందుకు ఈఆర్‌సీకి డిస్కంలు ప్రతిపాదనలు పంపించాయి. 

ఇది కూడా చదవండి: ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి

ఇందులో రూ.3,432 కోట్లకు ఈఆర్‌సీ కోత విధించింది. మిగిలిన రూ.7,912 కోట్లు (వ్యవసాయ సబ్సిడీ రూ.1500 కోట్లు పోగా) ప్రజల నుంచి వసూలు చేయడం కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా పర్మిషన్ రావడంతో ఈ సర్దుబాటు ఛార్జీలను యూనిట్‌కు 92 పైసల చొప్పున డిసెంబర్‌ నుంచి 2026 నవంబర్ వరకూ వసూలు చేయాలని డిస్కంలకు సూచనలు చేసింది. ఈఆర్సీ పర్మిషన్ మేరకు డిస్కంలు ప్రతీనెల 40 పైసలు చొప్పున రూ.2,868.90 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేశాయి. 

ఇది కూడా చదవండి: అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇప్పుడు బిచ్చగాడు, ఎందుకు అలా?

ఇది కూడా చదవండి: దామగుండం అడవిలో అగ్నిప్రమాదం.. అధికారులా పనేనా !

  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mark’s Health Update : పవన్ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే...?

సింగపూర్‌లో ఓ సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులలోకి పొగ చేరింది. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

New Update
Mark’s Health Update

Mark’s Health Update

Mark’s Health Update : సింగపూర్‌లో ఓ సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులలోకి పొగ చేరింది. దీంతో మార్క్ శంకర్‌ను ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు కూడా ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు. మరో మూడు రోజులు మార్క్ శంకర్‌ను ఆస్పత్రిలో ఉంచనున్నట్లు తెలిసింది.

Also read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!


 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై పవన్ టీం హెల్త్ అప్‌డేట్ విడుదల చేసింది. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబం కూడా మంగళవారం రాత్రి సింగపూర్ వెళ్లారు. అయితే అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. మార్క్ శంకర్‌ను ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు మార్చినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ.. పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్‌ చేరుకుని నేరుగా ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది.

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి మార్క్ శంకర్‌కు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తుండగా.. ప్రస్తుతం బయటకు తీసుకువచ్చినట్లు తెలిపింది. అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులలోకి పొగచేరింది. మార్క్ శంకర్‌కు మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని.. అలాగే వైద్యుల పర్యవేక్షణ అవసరమని డాక్టర్లు పవన్ కళ్యాణ్ కుటుంబానికి తెలియజేసినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ తెలిపింది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు తీసుకువచ్చారని.. మరిన్ని పరీక్షలు చేయడంతో పాటుగా మూడురోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్లు తెలిపింది.

Also Read: బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?

Advertisment
Advertisment
Advertisment