/rtv/media/media_files/2025/04/08/X0PVNZ3GTjppmUkeoEpn.jpg)
YS jagan helicoptor Photograph: (YS jagan helicoptor)
వైసీపీ నేత జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు. హెలికాఫ్టర్లో అక్కడికి చేరుకున్న జగన్ను చూడడానికి వందలాది వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జగన్ను కలిసేందుకు కార్యకర్తలు హెలికాఫ్టర్ వద్దకు దూసుకొచ్చారు. జనాలను పోలీసు సిబ్బంది నియంత్రించలేక పోయ్యారు. జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ (అద్దాలు) ధ్వంసమైయ్యాయి. భద్రతా కారణాల రీత్యా వీఐపీని అలాంటి పరిస్థితిలో హెలికాఫ్టర్లో తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.
08-04-2025@ysjagan పర్యటనకు కనీస భద్రత కరువు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనలో కనిపించిన భద్రతా లోపం వైయస్.జగన్ దిగే హెలిపాడ్ వద్ద సరిపడా లేని బందో బస్తు
— YSR Congress Party (@YSRCParty) April 8, 2025
జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో వీఐపీని తీసుకెళ్లలేమన్న… pic.twitter.com/lezUdB8h9K
హెలికాప్టర్ దగ్గర క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి సరిపడా సెక్యూరిటీ పెట్టలేదని పోలీసు వ్యవస్థపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ హత్యకు కుట్ర చేశారని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం పైలెట్ల సూచనతో రోడ్డు మార్గంలో జగన్ బెంగళూరుకు బయలుదేరారు.